Telangana

కేసులు పెట్టి భయపెట్టాలనే కుట్రలు

– చట్టపరంగా ధీటుగా ఎదుర్కొంటాo – బీఆర్‌ఎస్!

మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి :

తమ పై ఎన్ని కేసులు పెట్టి భయపెట్టాలనే కుట్రలు చేసినా తాము భయపడమని, చట్టపరంగా ధీటుగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు.ఇటీవల శేరిలింగంపల్లి బి ఆర్ ఎస్ నాయకులు మారబోయిన రవి యాదవ్ కు మియాపూర్ పోలీసు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం రోజు పోలీస్ స్టేషన్ కు రవి యాదవ్ హాజరై, తనపై నమోదు చేసిన అసత్య, అక్రమ కేసుకు సంబంధించి జారీ చేసిన నోటీసుకు సమాధానంగా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు రవి యాదవ్ అన్నారు. రా సందర్భంగా బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ సభ్యులు అడ్వకేట్ లక్ష్మణ్ తో కలిసి మియాపూర్ సీఐకి అధికారిక రిప్లై లెటర్ సమర్పించారు. ఎమ్మెల్యే అరికాపూడి గాంధీ అనుచరులు నమోదు చేసిన తప్పుడు కేసును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను పోలీసులకు సమర్పించించరనీ తెలిపారు.

ఈ సందర్భంగా రవి యాదవ్ ధీటుగా స్పందిస్తూ

“ప్రజల సమస్యలు లేవనెత్తితే కేసులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందనీ,ఒక్క కేసు పెడితే భయపడతామనుకుంటే అది వారి అజ్ఞానమే అని అన్నారు.తాము భయపడే వాళ్లం కాదనీ, చట్టపరంగా కూడా, ప్రజల మధ్య కూడా పోరాటం కొనసాగుతుంన్నారు.ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.రవి యాదవ్ కు అండగా నిలుస్తూ శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మద్దతు పలికారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శుభురాజ్, వాలా హరీష్ రావు, ఎర్రబెల్లి సతీష్, మాజీ కార్పొరేటర్, నవతా రెడ్డి, గోపురాజు శ్రీనివాస్, రామకిషన్ గౌడ్, రోజా, కలిదిండి, బి ఎస్ ఎన్ కిరణ్ యాదవ్,, విజయ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆర్. కార్తికేయ, అలావుద్దీన్ పటేల్, సురేష్ యాదవ్, శ్రీకాంత్, సంగారెడ్డి, షేక్ జమీర్, శివరాజ్ ముదిరాజ్, మల్లేష్, గణేష్ రెడ్డి, మజిత్, సంతోష్ నాయుడు, ముజీబ్, శ్రీనివాస్ రావ్ తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago