Telangana

ప్రతిష్టాత్మక ఏఐ సదస్సులో గీతం ప్రాతినిధ్యం

-లండన్ సమావేశంలో విశిష్ట అతిథిగా పాల్గొని, ప్రసంగించిన ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్

-పరిశోధనా పత్రాన్ని సమర్పించి అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలందుకున్న గీతం విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదులోని సీఎస్ఈ విభాగం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ ఇటీవల లండన్ లో నిర్వహించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) సదస్సులో విశిష్ట అతిథిగా పాల్గొని, కీలకోపన్యాసం చేశారు. ఈ విషయాన్ని గీతం వర్గాలు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.యునైటెడ్ కింగ్డమ్ (లండన్)లో ఈ నెలలో (జూన్) జరిగిన 13వ అంతర్జాతీయ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ థియరీ అండ్ అప్లికేషన్స్ (FICTA-2025) సదస్సులో ఆమె గీతంకు ప్రాతినిధ్యం వహించినట్టు తెలియజేశారు. లండన్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ (ఏఐ అండ్ డీఎస్) పరిశోధనా బృందం నిర్వహించిన ఈ సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు పాల్గొన్నట్టు వెల్లడించారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ లో ఎదురయ్యే సవాళ్లు, వాటి వినియోగంపై గీతం అధ్యాపకురాలు ప్రొఫెసర్ పర్వేకర్ కీలకోపన్యాసం చేశారన్నారు. విభిన్న పరిశ్రమలలో ఏఐ-ఎంఎల్ యొక్క క్లిష్టమైన పురోగతులు, వాస్తవ-ప్రపంచ వినియోగాలను ఆమె వివరించినట్టు తెలిపారు.సెర్బియాలోని సింగిడునమ్ విశ్వవిద్యాలయంలో ఆతిథ్య ఉపన్యాసకురాలిగా కూడా సేవలందిస్తున్న ప్రొఫెసర్ పర్వేకర్, అంతర్జాతీయ విద్యాపరమైన సంబంధాలు, సహకారాలకు ఊతమిస్తోందన్నారు. ప్రొఫెసర్ పర్వేకర్ మార్గదర్శనంలో సీఎస్ఈ చివరి ఏడాది విద్యార్థులు జి.సోహన్ కుమార్ రెడ్డి, ఆదిచేతన్ ఖోట్, టి.ఆశ్రిత్, బి.మణిచరణ్ రెడ్డి తదితరులు ఈ-కామర్స్ సైట్ల కోసం ఆటోమేటిక్ ధర పర్యవేక్షణ అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించినట్టు తెలియజేశారు. ఈ పత్ర రూపకల్పన కోసం వారు చేసిన కృషి, దాని ఔచిత్యం, అందులోని ఆవిష్కరణలు అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు పొందాయన్నారు.ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలో గీతం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని పరిశోధన, ఆవిష్కరణ, ప్రపంచ విద్యా కార్యకలాపాలలో రాణించడం గీతం యొక్క నిబద్ధతను ప్రస్ఫుటీకరిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago