Telangana

ప్రతిష్టాత్మక ఏఐ సదస్సులో గీతం ప్రాతినిధ్యం

-లండన్ సమావేశంలో విశిష్ట అతిథిగా పాల్గొని, ప్రసంగించిన ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్

-పరిశోధనా పత్రాన్ని సమర్పించి అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలందుకున్న గీతం విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదులోని సీఎస్ఈ విభాగం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ ఇటీవల లండన్ లో నిర్వహించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) సదస్సులో విశిష్ట అతిథిగా పాల్గొని, కీలకోపన్యాసం చేశారు. ఈ విషయాన్ని గీతం వర్గాలు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.యునైటెడ్ కింగ్డమ్ (లండన్)లో ఈ నెలలో (జూన్) జరిగిన 13వ అంతర్జాతీయ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ థియరీ అండ్ అప్లికేషన్స్ (FICTA-2025) సదస్సులో ఆమె గీతంకు ప్రాతినిధ్యం వహించినట్టు తెలియజేశారు. లండన్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ (ఏఐ అండ్ డీఎస్) పరిశోధనా బృందం నిర్వహించిన ఈ సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు పాల్గొన్నట్టు వెల్లడించారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ లో ఎదురయ్యే సవాళ్లు, వాటి వినియోగంపై గీతం అధ్యాపకురాలు ప్రొఫెసర్ పర్వేకర్ కీలకోపన్యాసం చేశారన్నారు. విభిన్న పరిశ్రమలలో ఏఐ-ఎంఎల్ యొక్క క్లిష్టమైన పురోగతులు, వాస్తవ-ప్రపంచ వినియోగాలను ఆమె వివరించినట్టు తెలిపారు.సెర్బియాలోని సింగిడునమ్ విశ్వవిద్యాలయంలో ఆతిథ్య ఉపన్యాసకురాలిగా కూడా సేవలందిస్తున్న ప్రొఫెసర్ పర్వేకర్, అంతర్జాతీయ విద్యాపరమైన సంబంధాలు, సహకారాలకు ఊతమిస్తోందన్నారు. ప్రొఫెసర్ పర్వేకర్ మార్గదర్శనంలో సీఎస్ఈ చివరి ఏడాది విద్యార్థులు జి.సోహన్ కుమార్ రెడ్డి, ఆదిచేతన్ ఖోట్, టి.ఆశ్రిత్, బి.మణిచరణ్ రెడ్డి తదితరులు ఈ-కామర్స్ సైట్ల కోసం ఆటోమేటిక్ ధర పర్యవేక్షణ అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించినట్టు తెలియజేశారు. ఈ పత్ర రూపకల్పన కోసం వారు చేసిన కృషి, దాని ఔచిత్యం, అందులోని ఆవిష్కరణలు అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు పొందాయన్నారు.ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలో గీతం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని పరిశోధన, ఆవిష్కరణ, ప్రపంచ విద్యా కార్యకలాపాలలో రాణించడం గీతం యొక్క నిబద్ధతను ప్రస్ఫుటీకరిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

7 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago