Telangana

జూన్ 21న పటాన్చెరులో అంతర్జాతీయ యోగా దినోత్సవం

మైత్రి మైదానంలో భారీ ఏర్పాట్లు 

భారీ సంఖ్యలో హాజరుకానున్న విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు, అధికారులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 21వ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల నుండి 9 గంటల వరకు పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో భారీ స్థాయిలో యోగా దినోత్సవం వేడుకలు ఏర్పాటు చేస్తున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో.వివిధ శాఖల అధికారులు, యోగ నిర్వహణ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మైత్రి మైదానంలో. యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగ అనే పదం పరమాత్మతో మనస్సు యొక్క అనుసంధానం ఫలితంగా పరిపూర్ణమైన సమస్థితిని లేదా మానసిక సమతుల్యతను సూచిస్తుందని తెలిపారు. యోగ దినోత్సవం లో ప్రతి ఒక్కరి పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిఐ వినాయక్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago