మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక వహించిన చాకలి ఐలమ్మ 128 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు టీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు . సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి కేటీఆర్ సన్మానించారు .చిట్కూల్ గ్రామంలో చాకలి ఐలమ్మ అతిపెద్ద కాంస్య విగ్రహం అవిష్కరణకు తాను రావాలేకపోయానని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో నీలం మధు ముదిరాజ్ , ఎమ్మెల్సీ బండా ప్రకాష్ తో కలిసి మంత్రి కేటీఆర్ ను కలిశారు .నీలం మధు ముదిరాజ్ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి దసరా ,దీపావళీ శుభాకాంక్షులు తెలిపారు.
చిట్కూల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించినందుకు మంత్రి కేటీఆర్ తనను అభినందించినట్లు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్లాలని సూచించారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసిన మహనీయులను గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి విషయమన్నారు ఈ స్ఫూర్తితోనే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నాయకుడు అల్లుడు జగన్, డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…