Telangana

చాకలి ఐలమ్మ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన నీలం మ‌ధు ముదిరాజ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్

మనవార్తలు ,పటాన్ చెరు:

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీల‌క‌ భూమిక వ‌హించిన‌ చాకలి ఐలమ్మ 128 వ జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించినందుకు టీఆర్ఎస్ నేత నీలం మ‌ధు ముదిరాజ్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు . సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామంలో చాక‌లి ఐల‌మ్మ జయంతోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించినందుకు మంత్రి కేటీఆర్ స‌న్మానించారు .చిట్కూల్ గ్రామంలో చాక‌లి ఐల‌మ్మ‌ అతిపెద్ద‌ కాంస్య విగ్ర‌హం అవిష్క‌ర‌ణ‌కు తాను రావాలేక‌పోయాన‌ని మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. హైద‌రాబాద్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో నీలం మ‌ధు ముదిరాజ్ , ఎమ్మెల్సీ బండా ప్ర‌కాష్ తో క‌లిసి మంత్రి కేటీఆర్ ను క‌లిశారు .నీలం మ‌ధు ముదిరాజ్ మంత్రి కేటీఆర్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ద‌స‌రా ,దీపావ‌ళీ శుభాకాంక్షులు తెలిపారు.

చిట్కూల్ గ్రామంలో చాక‌లి ఐలమ్మ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించినందుకు మంత్రి కేటీఆర్ త‌న‌ను అభినందించిన‌ట్లు నీలం మ‌ధు ముదిరాజ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్లాలని సూచించారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసిన మహనీయులను గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి విషయమన్నారు  ఈ స్ఫూర్తితోనే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నాయకుడు అల్లుడు జగన్, డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago