మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక వహించిన చాకలి ఐలమ్మ 128 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు టీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు . సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి కేటీఆర్ సన్మానించారు .చిట్కూల్ గ్రామంలో చాకలి ఐలమ్మ అతిపెద్ద కాంస్య విగ్రహం అవిష్కరణకు తాను రావాలేకపోయానని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో నీలం మధు ముదిరాజ్ , ఎమ్మెల్సీ బండా ప్రకాష్ తో కలిసి మంత్రి కేటీఆర్ ను కలిశారు .నీలం మధు ముదిరాజ్ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి దసరా ,దీపావళీ శుభాకాంక్షులు తెలిపారు.
చిట్కూల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించినందుకు మంత్రి కేటీఆర్ తనను అభినందించినట్లు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్లాలని సూచించారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసిన మహనీయులను గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి విషయమన్నారు ఈ స్ఫూర్తితోనే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నాయకుడు అల్లుడు జగన్, డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…