– గీతమ్ నిర్వహించిన ‘ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’లో డాక్టర్ డయానా
మనవార్తలు ,పటాన్ చెరు:
ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాలని , బాగా నిద్రపోవాలని , కనీస శారీరక వ్యాయామం చేయాలని , సమాజంతో కలగలిసి పోవాలని , మద్యం / మాదకద్యవ్యాలకు దూరంగా ఉండాలని కౌన్సెలింగ్ సెక్షాలజిస్టు , హెదరాబాద్ అకాడమీ ఆఫ్ సెక్షాలజీ వ్యవస్థాపక డెరైక్టర్ డాక్టర్ డయానా మోంటెరో అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎసాచ్ఎస్ ) లోని మానసిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’లో ఒక వక్తగా ఆమె ప్రసంగించారు . ‘ అందరికీ మానసిక ఆరోగ్యం , శ్రేయస్సును అందించడం ‘ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ , ప్రవర్తన , ఆలోచన , భావాలను బట్టి మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుందన్నారు . ఆశావాదులు ఎక్కువ కాలం జీవించగలరని , కాబట్టి ప్రతి ఒక్కరూ మరింత ఆరోగ్యకరమైన ప్రవర్తనతో మెలగాలని ఆమె సూచించారు .
ఇతరులతో మంచి స్నేహం , సంబంధాలు , సంతృప్తికర కళాశాల జీవనం , మనతో మనం నిరంతరం అనుసంధానం కలిగి ఉండడం మంచిదని డాక్టర్ డయానా హితవు పలికారు . ఏకాగ్రత కోల్పోవడం , ప్రతికూలత , ఆకలి / నిద్ర / మానసిక స్థితిలో మార్పు , పదార్థ దుర్వినియోగం , అస్తవ్యస్తత , ఒంటరిగా ఉండడం , ఒత్తిడికి గురవడం , స్వీయ విధ్వంసక ప్రవర్తనలు అసమతుల్య మానసిక ఆరోగ్యానికి హెచ్చరిక సంకేతాలని డాక్టర్ డయానా వివరించారు . ఫ్రీలాన్స్ ట్రాఫిక్ సెక్షాలజిస్టు అనఘ ‘ మానసిక ఆరోగ్య సమస్యల సంకేతాలను గుర్తించడం ‘ అనే అంశంపై ఎక్స్ప్రెషనిస్ట్ డ్యాన్సర్ పి.చిదానంద శాస్త్రి ‘ ఔషధాలను వినియోగించి మానసిక కృంగుబాటును అధిగమించడం ‘ అనే అంశంపై ఉపన్యసించారు . విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలకు వారు సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు . తొలుత కార్యక్రమ నిర్వాహకురాలు మానసిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గేష్ నందినీ అతిథులను పరిచయం చేయగా , విశిష్ట ఆచార్యుడు డాక్టర్ జీని రామారావు వారిని సత్కరించారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…