గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లో ‘మెర్రీ మిక్సింగ్’ పేరిట వినోధభరితమైన కేక్ మేకింగ్ కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. క్రిస్మస్ ఆనందాన్ని పంచేందుకు వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఆహ్వానిస్తూ ఆతిథ్య (హాస్పిటాలిటీ) విభాగం ఈ వేడుకను నిర్వహిస్తోంది.క్రిస్మస్ సీజన్ సమీపిస్తున్నందున, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రుచికరమైన స్నాక్స్, ట్రీట్లతో జరుపుకోవడాన్ని గీతం ప్రోత్సహిస్తోంది. వర్ధమాన ఇంజనీర్లు, మేనేజర్లు, శాస్త్రవేత్తలు, ఫార్మసిస్టులు, ఆర్కిటెక్ట్లు, ఇతర విభాగాల విద్యార్థులను ఒకచోట చేర్చడం లక్ష్యంగా ఈ కేక్ మిక్సింగ్ వేడుకలను నిర్వహిస్తున్నారు.’మెర్రీ మిక్సింగ్’ వేడుకను నిర్వహించడాన్ని, పండుగ సీజన్ను ఉత్సాహభరితం చేయడానికి సంతోషిస్తున్నట్టు ఆతిథ్య విభాగం డిప్యూటీ డెరైక్టర్ అంబికా ఫిలిప్ తెలిపారు. ఈ వేడుక తమ ప్రాంగణంలో ఆనందం, ఉత్సాహాన్ని నింపడమే గాక తమ విద్యార్థుల మధ్య ఐక్యత, వేడుకల భావాన్ని పెంపొందిస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు.మెర్రీ మిక్సింగ్’ వేడుక కోసం విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా చూడడమే కాక, ఇందులో పాల్గొనమని తమ తోటివారిని కూడా ప్రోత్సహిస్తున్నట్టు అంబిక తెలియజేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…