Telangana

లిబరల్ ఎడ్యుకేషన్ ద్వారా బహుముఖ ప్రజ్ఞుర్ డిఆర్ పి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా, విద్యార్థులలో అంతర్ విభాగ నెపుణ్యాలను (బహుముఖ ప్రజ్ఞ) పెంపొందించడంతో పాటు వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు లిబరల్ ఎడ్యుకేషన్ విధానాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అమలు చేస్తున్నట్టు ఆంగ్ల విభాగాధిపతి ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్ చెప్పారు. సికింద్రాబాద్ లోని సెయింట్ మార్చ్ కాలేజి విద్యార్థులు మంగళవారం గీతం సందర్శనకు రాగా, వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో విద్యార్థులకు క్లిష్టమైన సమస్య-పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన, భావ ప్రకటనా (కమ్యూనికేషన్) నెహ్రుణ్యాలతో పాటుగా కళలు (ఆర్ట్స్), మానవీయ శాస్త్రాలు (హ్యుమానిటీస్), మేనేజ్మెంట్, సెన్స్లలోని అంతర్ విభాగ పాఠ్యాంశాలను మేజర్, మెన్హర్లగా అభ్యసించవచ్చని తెలియజేశారు.లిబరల్ ఎడ్యుకేషన్ ప్రకారం, విద్యార్థులు బీఏ, బీబీఏ, బీఎస్సీలలో దేనిలో చేరినా, మొదటి సెమిస్టర్లో అంతా ఒకేరకమైన పాఠ్యాంశాలను అభ్యసిస్తారని, రెండో సెమిస్టర్లో విద్యార్థులు కావాలనుకుంటే ఈ మూడింటిలో ఒకదాని నుంచి మరో కోర్సుకు మారవచ్చన్నారు. బీఏలో ప్రవేశం పొందినవారు అందులో నుంచి ఎక్కువ పాఠ్యాంశాలతో (60 క్రెడిట్లు) పాటు కొన్ని పాఠ్యాంశాలను (24 క్రెడిట్లు) బీబీఏ లేదా బీఎస్సీ నుంచి కూడా తీసుకోవచ్చని చెప్పారు.గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.శశికుమార్ డిగ్రీ స్థాయిలో వృత్తిపరమైన కోర్సుల ఎంపిక, ఉపాధి అవకాశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశీలించాల్సిన అంశాలగురించివివరించారు.ఎన్.శివమల్లికార్జునరావు సహకారంతో గీతం అడ్మిషన్ల విభాగాధిపతి డాక్టర్ కె.శివకుమార్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. విద్యార్థులకు హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, కామర్స్ విభాగాలతో పాటు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఇతర మౌలిక సదుపాయాలను చూపారు. ఔత్సాహిక విద్యార్థులు, వారు ఎంచుకున్న రంగాలలో రాణించడానికి అవసరమైన నెఫుణ్యాలు, జ్ఞానాన్ని పొందడానికి ఇటువంటి పర్యటనలు దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, వారితో పాటు వచ్చిన అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.చాలా అంశాలపై ఒక అవగాహన వచ్చిందని, తమ భవిష్యత్తు మెరుగుపరచగల కెరీర్ ను ఎంపిక చేసుకోవ డానికి ఈ పర్యటనలో పొందిన సమాచారం ఉపకరిస్తుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago