Telangana

లిబరల్ ఎడ్యుకేషన్ ద్వారా బహుముఖ ప్రజ్ఞుర్ డిఆర్ పి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా, విద్యార్థులలో అంతర్ విభాగ నెపుణ్యాలను (బహుముఖ ప్రజ్ఞ) పెంపొందించడంతో పాటు వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు లిబరల్ ఎడ్యుకేషన్ విధానాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అమలు చేస్తున్నట్టు ఆంగ్ల విభాగాధిపతి ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్ చెప్పారు. సికింద్రాబాద్ లోని సెయింట్ మార్చ్ కాలేజి విద్యార్థులు మంగళవారం గీతం సందర్శనకు రాగా, వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో విద్యార్థులకు క్లిష్టమైన సమస్య-పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన, భావ ప్రకటనా (కమ్యూనికేషన్) నెహ్రుణ్యాలతో పాటుగా కళలు (ఆర్ట్స్), మానవీయ శాస్త్రాలు (హ్యుమానిటీస్), మేనేజ్మెంట్, సెన్స్లలోని అంతర్ విభాగ పాఠ్యాంశాలను మేజర్, మెన్హర్లగా అభ్యసించవచ్చని తెలియజేశారు.లిబరల్ ఎడ్యుకేషన్ ప్రకారం, విద్యార్థులు బీఏ, బీబీఏ, బీఎస్సీలలో దేనిలో చేరినా, మొదటి సెమిస్టర్లో అంతా ఒకేరకమైన పాఠ్యాంశాలను అభ్యసిస్తారని, రెండో సెమిస్టర్లో విద్యార్థులు కావాలనుకుంటే ఈ మూడింటిలో ఒకదాని నుంచి మరో కోర్సుకు మారవచ్చన్నారు. బీఏలో ప్రవేశం పొందినవారు అందులో నుంచి ఎక్కువ పాఠ్యాంశాలతో (60 క్రెడిట్లు) పాటు కొన్ని పాఠ్యాంశాలను (24 క్రెడిట్లు) బీబీఏ లేదా బీఎస్సీ నుంచి కూడా తీసుకోవచ్చని చెప్పారు.గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.శశికుమార్ డిగ్రీ స్థాయిలో వృత్తిపరమైన కోర్సుల ఎంపిక, ఉపాధి అవకాశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశీలించాల్సిన అంశాలగురించివివరించారు.ఎన్.శివమల్లికార్జునరావు సహకారంతో గీతం అడ్మిషన్ల విభాగాధిపతి డాక్టర్ కె.శివకుమార్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. విద్యార్థులకు హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, కామర్స్ విభాగాలతో పాటు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఇతర మౌలిక సదుపాయాలను చూపారు. ఔత్సాహిక విద్యార్థులు, వారు ఎంచుకున్న రంగాలలో రాణించడానికి అవసరమైన నెఫుణ్యాలు, జ్ఞానాన్ని పొందడానికి ఇటువంటి పర్యటనలు దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, వారితో పాటు వచ్చిన అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.చాలా అంశాలపై ఒక అవగాహన వచ్చిందని, తమ భవిష్యత్తు మెరుగుపరచగల కెరీర్ ను ఎంపిక చేసుకోవ డానికి ఈ పర్యటనలో పొందిన సమాచారం ఉపకరిస్తుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago