పటాన్చెరులో ఘనంగా పంచాంగ శ్రవణం
హాజరైన ప్రజా ప్రతినిధులు, పట్టణ పుర ప్రముఖులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ప్రజల జీవితాల్లో నూతన కాంతి వెలుగులు నింపాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభిలాషించారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు రాశి ఫలాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, మాజీ జడ్పీటీసీ జైపాల్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, ప్రతాప్ గౌడ్, ప్రకాష్ రావు, మాజీ ఎంపిటిసి రామచంద్ర రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
దేవాలయాల సందర్శన
ఉగాది పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయం, పటాన్చెరు పట్టణ పరిధిలోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయాలను ఎమ్మెల్యే జిఎంఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సిఐ వినాయక్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, రుద్రారం సొసైటీ చైర్మన్ పాండు, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, వెంకన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…