మాస్కే శ్రీరామ రక్ష….
-డాక్టర్ జీవీఎస్ రావు
హైదరాబాద్ సిి :
భౌతిక దూరం పాటించడంతో పాటు… మాస్క్ ధరించడంతోనే కరోనా గోలుసును తెంపవచ్చని డాక్టర్ రావూస్ ఈఎన్టీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు .
హైదరాబాద్ ఎంజీబీఎస్, కాచీగూడ రైల్వే స్టేషన్ , కేపీహెచ్బీ బస్టాండ్లో డాక్టర్ రావూస్ ఈఎన్టీ ఆసుపత్రి ,హైదరాబాద్ ఈఎన్టీ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా వలస కూలీలకు, ప్రయాణీకులకు ఉచితంగా మాస్కులు , వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాల పంపిణీ చేశారు. 18 ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ,కోవిద్ వచ్చినా త్వరగా కోలుకుంటారని చెప్పారు. కరోనా నుంచి రక్షణ కోసం మాస్క్లు ,గ్లౌజ్లు, శానిటైజర్లు వాడాలని పిలుపునిచ్చారు.
కోవిద్ 19 అనేది శ్వాసకోస వ్యాధి అని … దగ్గినప్పుడు ,తుమ్మినప్పుడు ,తుంపర్ల ద్వారా ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుందని డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు.ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం ద్వారానే కోవిద్ వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చన్నారు .ఇలా ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా మాస్క్ సాయం చేస్తే .. కొంత మంది పేదలైనా కరోనా బారిన పడకుండా కాపాడుకోగలుగుతామన్నారు. భాగ్యనగరంలో పది వారాల పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉచితంగా లక్ష మాస్కులు, వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు డాక్టర్ రావ్ తెలిపారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…