_దోమడుగు లో కరెంట్ షాక్ తో ఐదు బర్రెలు మృతి
_ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేత
మనవార్తలు ,గుమ్మడిదల
పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన బొంది సంజీవ కు చెందిన ఆరు బర్రెలు సోమవారం రాత్రి కురిసిన గాలివానకు విద్యుదాఘాతానికి గురయ్యాయి. వీటిలో ఐదు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. కుటుంబానికి ఆధారమైన బర్రెలు మృతి చెందటంతో సంజీవ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తెలిపారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. మంగళవారం ఉదయం జడ్పిటిసి కుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, స్థానిక నాయకుల సమక్షంలో రైతు కుటుంబానికి ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా జడ్పిటిసి కుమార్ గౌడ్ మాట్లాడుతూ రైతు కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…