_దోమడుగు లో కరెంట్ షాక్ తో ఐదు బర్రెలు మృతి
_ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేత
మనవార్తలు ,గుమ్మడిదల
పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన బొంది సంజీవ కు చెందిన ఆరు బర్రెలు సోమవారం రాత్రి కురిసిన గాలివానకు విద్యుదాఘాతానికి గురయ్యాయి. వీటిలో ఐదు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. కుటుంబానికి ఆధారమైన బర్రెలు మృతి చెందటంతో సంజీవ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తెలిపారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. మంగళవారం ఉదయం జడ్పిటిసి కుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, స్థానిక నాయకుల సమక్షంలో రైతు కుటుంబానికి ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా జడ్పిటిసి కుమార్ గౌడ్ మాట్లాడుతూ రైతు కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…