ఇష్టా జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ
జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నాణ్యత ప్రమాణాలతో నే ఇష్టా జూనియర్ కళాశాల నిర్వహణ కొనసాగుతున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ జిల్లా అధికారి (డిఐఈఓ)గోవింద్ రామ్ పేర్కొన్నారు. పటేల్ గూడ లోని ఇష్టా జూనియర్ కళాశాలలో నాసిరకం భోజనం వడ్డిస్తున్నారనే వచ్చిన వార్తలపై మంగళవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి గోవింద్ రామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ ను పరిశీలించడంతోపాటు విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ కళాశాలకు గుర్తింపు లేదనే ప్రచారం అసత్యమని, గుర్తింపు ఉంది కాబట్టే విద్యార్థులు పరీక్ష రాయడానికి ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా హాల్ టికెట్లు అందజేశామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఇష్టా జూనియర్ కాలేజీలోకి బయట వ్యక్తులు వచ్చి న్యూసెన్స్ చేశారని అన్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారమే కళాశాల నిర్వాహణ కొనసాగుతుందని చెప్పారు. జిల్లా అధికారితో పాటు ఇష్టా జూనియర్ కాలేజీ అకాడమిక్ డీన్, ప్రేమ్ కుమార్, ప్రిన్సిపల్ దీప, తదితరులు ఉన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…