Telangana

గీతంలో ‘పట్టణ స్థిరత్వానికి మూలస్థంభాలు’పై అధ్యాపక శిక్షణ

ఆర్కిటెక్చర్ కౌన్సిల్ (సీవోఏ) సౌజన్యంతో నిర్వహణ

అర్హులకు ధ్రువీకరణ పత్రాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీవోఏ) సహకారంతో హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (జీఎస్ఏ), ‘పట్టణ స్థిరత్వానికి మూలస్థంభాలు’పై అధ్యాపక శిక్షణా కార్యక్రమాన్ని (టీటీపీ) మార్చి 17 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనుంది. ఇది నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో స్థిరమైన పట్టణ అభివృద్ధి యొక్క కీలకమైన అవసరాన్ని పరిష్కరిస్తుందని విశ్వసిస్తున్నారు.పూణేలోని సీవోఏ-టీఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ జయశ్రీ దేశ్ పాండే నేతృత్వంలో, గీతం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బీ.ఎన్. కీర్తి నాయుడు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. పర్యావరణ, సామాజిక, ఆర్థిక స్థిరత్వం అనే మూడు కీలక స్తంభాలపై దృష్టి సారించడం ద్వారా సమకాలీన పట్టణ సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన జ్జానం, సాధనాలతో విద్యావేత్తలు, భాగస్వాములను సన్నద్ధం చేయడం దీని లక్ష్యం.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, నిర్వాహకులు, విధాన రూపకర్తలను ఒకచోట చేర్చడం ద్వారా, ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకు స్థితి స్థాపకమైన, స్థిరమైన నగరాలను సృష్టించడానికి అర్థవంతమైన చర్చలు, వినూత్న పరిష్కారాలను పెంపొందించడానికి ప్రయత్నిస్తోంది.సామాజిక, వారసత్వ, ఆర్థిక, పర్యావరణ రంగాలలో స్థిరత్వంపై విద్యా, పరిశ్రమ రంగాల నుంచి ప్రముఖ వక్తలు పాల్గొని శిక్షణ ఇవ్వనున్నారు. పట్టణ స్థిరత్వం కోసం ఉత్తమ పద్ధతులు, వ్యూహాలను అన్వేషించడానికి ఇది ఓ వేదికగా తోడ్పడనుంది. ఈ కార్యక్రమ సారాంశాన్ని పుస్తక రూపంలో ప్రచురించడంతో పాటు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ధ్రువీకరణ పత్రాలను ప్రదానం చేయనున్నారు.ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు మార్చి 11వ తేదీలోగా గూగుల్ ఫారమ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాల కోసం కార్యక్రమ సమన్వయకర్తలు 9704 072 387, 9949 807 144లను సంప్రదించాలి, లేదా kbogadi@gitam.edu / gvaddipa@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలి.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago