మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలను విజయవంతం చేయాలని మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల శాసనమండలి సభ్యులు అంజి రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ 6,7 తేదీలలో రాజమహేంద్రవరంలో జరుగనున్న ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్సీ అంజిరెడ్డి చేతుల మీదుగా అవిష్కరించటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలుగు భాషా పరిరక్షణకు బాధ్యతయుతంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగు భాషోద్దరణకు సాహితీ సభలు ఎంతో కీలకమన్నారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ భూషణం,ప్రపంచ తెలుగు సాహితీ మహాసభల జాతీయ సమన్వయకర్తలు , స్థానిక కవులు తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి రచయితల సంఘం అధ్యక్షులు మోటూరి నారాయణరావు శేరిలింగంపల్లి రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు అరవా, శేరిలింగంపల్లి రచయితల సంఘం ఉపాధ్యక్షులు జె.వి.కుమార్ చేపూరి, ప్రముఖ కవి, రచయిత, దర్శకులు గూండ్ల నారాయణ తదితరులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని గౌరవ ప్రధంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,కవులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…