Telangana

ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలను విజయవంతం చేయండి: ఎమ్మెల్సీ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలను విజయవంతం చేయాలని మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల శాసనమండలి సభ్యులు అంజి రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ 6,7 తేదీలలో రాజమహేంద్రవరంలో జరుగనున్న ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్సీ అంజిరెడ్డి చేతుల మీదుగా అవిష్కరించటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలుగు భాషా పరిరక్షణకు బాధ్యతయుతంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగు భాషోద్దరణకు సాహితీ సభలు ఎంతో కీలకమన్నారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ భూషణం,ప్రపంచ తెలుగు సాహితీ మహాసభల జాతీయ సమన్వయకర్తలు , స్థానిక కవులు తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి రచయితల సంఘం అధ్యక్షులు మోటూరి నారాయణరావు శేరిలింగంపల్లి రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు అరవా, శేరిలింగంపల్లి రచయితల సంఘం ఉపాధ్యక్షులు జె.వి.కుమార్ చేపూరి, ప్రముఖ కవి, రచయిత, దర్శకులు గూండ్ల నారాయణ తదితరులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని గౌరవ ప్రధంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,కవులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago