Telangana

నిరుద్యోగ మార్చ్ విజయవంతం చేయండి : గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న నిరుద్యోగ మార్చ్ న్ విజయవంతం చేయాలని గడిల శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి నుండి కొత్త బస్టాండ్ వరకు జరిగే నిరుద్యోగ మార్చ్ న్  భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు . బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంతంత మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ఖాళీలను గుర్తించి ,ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు .

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్లుగా బయటికివస్తున్నారని..వారికి తగిన ఉపాధి అవకాశాలు లేక కూలీ పనులు చేసుకుంటున్నారని గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. యువతే దేశానికి పెద్ద వనరులు అని ప్రకటిస్తున్న ప్రభుత్వం ఆ యువతను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో సైతం అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు .సంగారెడ్డిలో ఈ నెల 11 వ తేదీన బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మార్కు బీజేపీ నేతలు ,కార్యకర్తలు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

10 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

10 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

10 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

22 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago