Telangana

గీతం బీ-స్కూల్లో డేటా అనలిటిక్స్ పై ఎఫ్ ఢీపీ…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్ మే 1 నుంచి 10వ తేదీ వరకు ‘ఆర్, పట్టికని ఉపయోగించి అధునాతన పరిశోధన కోసం సమాచార విశ్లేషణ’ అనే అంశంపై పది రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్ఐటీ వరంగల్లోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ, మేనేజ్మెంట్ స్కూల్ సంయుక్త సౌజన్యంతో దీనిని నిర్వహిస్తున్నట్టు సమన్వయకర్త డాక్టర్ మెరుగు వేణుగోపాల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.డేటా ప్రాముఖ్యత, సమాచార విశ్లేషణ పరిచయం, గణాంక పద్ధతులు అవలోకనం, జన్యు అల్గారిథమ్ లు, వ్యాపార పరిశోధనలో మల్టీవియారిట్ టెక్నిక్ల పరిచయం మొదలైనవి ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో వక్తలుగా ఎస్ఐటీ వరంగల్ మేనేజిమెంట్ స్కూల్కు చెందిన ప్రొఫెసర్ ఎం.రవీందర్రెడ్డి, డాక్టర్ పీఆర్సీ గోపాల్; ఎన్ఐటీ సూరత్కల్కు చెందిన డాక్టర్ రితాంజలి మారీ, ఎస్ఐటీ కాలికట్కు చెందిన డాక్టర్ నిత్య, జర్మనీలోని పోస్ట్ డాక్టర్ ఫెలో డాక్టర్ సమీరన్ దాస్లతో పాటు ముగ్గురు గీతం బీ-స్కూల్ అధ్యాపకులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
ఎంబీఏ, ఇంజనీరింగ్, ఎంసీఏ, ఇతర అనుబంధ విభాగాల అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని, అలాగే అనుబంధ రంగాల పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది కూడా హాజరు కావచ్చని డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ముందుగా వచ్చిన వారికి, ఇందులో పాల్గొనడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, గరిష్ఠంగా వంద మంది వరకు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికెన వారి జాబితా ఈ-మెయిల్ దారా తెలియజేస్తామన్నారు.పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం 9959 260 114 లేదా vmerugu@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సమన్వయకర్త సూచించారు.
admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago