Telangana

అమర్నాథ్ రెడ్డికి డాక్టరేట్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

”అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల ద్వారా పోర్ట్ఫోలియో మేనేజ్ మెంట్ సేవలపై పెట్టుబడిదారుల అవగాహన అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్ మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి బి.అమర్నాథ్ రెడ్డిని డాక్టరేట్ వరించింది.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ హెదరాబాద్ పూర్వ ప్రొఫెసర్ ఎ.శ్రీరామ్: సుంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.పెట్టుబడిదారుల ముందస్తు కొనుగోలు అవసరాలు, కొనుగోలు అనంతర సేవలు, ప్రమాద అవగాహన, వార్షిక నిర్వహణ సదుపాయాలను అందించే పోర్ట్ఫోలియో మేనేజ్ మెంట్ సేవలపై, పెట్టుబడిదారులు నిర్ణయాలపై వాటి ప్రభావాన్ని ఈ అధ్యయనంలో విశ్లేషించినట్టు తెలిపారు.

పోర్ట్ఫోలియో మేనేజ్ మెంట్ సేవల్లో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయాలు తీసుకునే ముందు, కొనుగోలుకు : ముందు, ఆ తరువాత అవసరాలను జాగ్రత్తగా విశ్లేషించాలని పెట్టుబడిదారులకు సూచించామని, అలాగే ప్రమాద విశ్లేషణ మొత్తం సంతృప్త స్థాయిలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని కనుగొన్నానున్నారు.అమర్నాథ్ రెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీఏసీఎస్ఆర్ వర్మ, గీతం బిజినెస్ స్కూల్-హెదరాబాద్ డెరైక్టర్లు ప్రొఫెసర్ వినయ్ కుమార్ అప్పరాజు, ప్రొఫెసర్ టి.కరుణాకర్, పలు: విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు..

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago