Telangana

అమర్నాథ్ రెడ్డికి డాక్టరేట్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

”అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల ద్వారా పోర్ట్ఫోలియో మేనేజ్ మెంట్ సేవలపై పెట్టుబడిదారుల అవగాహన అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్ మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి బి.అమర్నాథ్ రెడ్డిని డాక్టరేట్ వరించింది.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ హెదరాబాద్ పూర్వ ప్రొఫెసర్ ఎ.శ్రీరామ్: సుంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.పెట్టుబడిదారుల ముందస్తు కొనుగోలు అవసరాలు, కొనుగోలు అనంతర సేవలు, ప్రమాద అవగాహన, వార్షిక నిర్వహణ సదుపాయాలను అందించే పోర్ట్ఫోలియో మేనేజ్ మెంట్ సేవలపై, పెట్టుబడిదారులు నిర్ణయాలపై వాటి ప్రభావాన్ని ఈ అధ్యయనంలో విశ్లేషించినట్టు తెలిపారు.

పోర్ట్ఫోలియో మేనేజ్ మెంట్ సేవల్లో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయాలు తీసుకునే ముందు, కొనుగోలుకు : ముందు, ఆ తరువాత అవసరాలను జాగ్రత్తగా విశ్లేషించాలని పెట్టుబడిదారులకు సూచించామని, అలాగే ప్రమాద విశ్లేషణ మొత్తం సంతృప్త స్థాయిలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని కనుగొన్నానున్నారు.అమర్నాథ్ రెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీఏసీఎస్ఆర్ వర్మ, గీతం బిజినెస్ స్కూల్-హెదరాబాద్ డెరైక్టర్లు ప్రొఫెసర్ వినయ్ కుమార్ అప్పరాజు, ప్రొఫెసర్ టి.కరుణాకర్, పలు: విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు..

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago