Telangana

ఆధారాలతో ఆరోపణలు చేయండి.. సమాధానం ఇచ్చేందుకు సిద్ధం

_చిల్లర రాజకీయాలు మానుకోండి

_ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ హితవు

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :

ఆధారాలతో కూడిన సహేతుక ఆరోపణలు చేస్తే సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని,
అధికార పార్టీని బదనాం చేయాలన్న కుటిల బుద్ధితో చిల్లర ఆరోపణలు చేస్తే ప్రజలు చీత్కరించుకుంటారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు.

సోమవారం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన అమీన్పూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతుంటే.. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని చూసి ఓర్వలేక అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ పరిధిలోని శంభునికుంట చెరువు పరిధిలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కబ్జాలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల విమర్శిస్తున్నాయని, ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని అన్నారు గతంలో సర్వే ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ పై వివిధ రకాల విమర్శలు రావడంతో తిరిగి సర్వే చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించడం జరిగిందని తెలిపారు. దీంతోపాటు పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు పరిధిలోని సర్వేనెంబర్ 620లో మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి తో పాటు బలహీన వర్గాలకు చెందిన పది ఎకరాల సీలింగ్ పట్టా భూమిని ఎఫ్ టి ఎల్ లో చూపిస్తూ అప్పటి సర్వే బృందం రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. ఈ అంశంలోనూ తిరిగి సర్వే చేయాలని ప్రభుత్వానికి అప్పీలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ప్రతి రోజు ప్రతిక్షణం ప్రజల్లో తిరుగుతూ ప్రజల సంక్షేమం కోసం బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పని చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికి కోసం ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. అసైన్మెంట్ భూములను కొనుగోలు చేస్తూ క్రయ విక్రయాలు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డే జైపాల్ సైతం బిఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.ఆధారాలతో ఆరోపణలు చేస్తే సమాధానాలు ఇవ్వడానికి ఎల్లప్పుడూ తమ సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఈ సమావేశంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago