Telangana

ఇష్టపడి చదవండి..లక్ష్యాన్ని సాధించండి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకం

_ఒకే రోజు 5000 మంది 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పరీక్ష సామాగ్రి పంపిణీ

_ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ సతీష్ చే మోటివేషనల్ క్లాసెస్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పదవతరగతి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి సౌజన్యంతో పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి విద్యను అభ్యసిస్తున్న 5000 మంది విద్యార్థులకు ప్రముఖ మానసిక వ్యక్తిత్వ నిపుణులు డాక్టర్ సతీష్ చే మోటివేషనల్ తరగతులు నిర్వహించారు. అనంతరం ప్రతి విద్యార్థికి స్టడీ మెటీరియల్, పరీక్షా ప్యాడ్, పెన్నులను పంపిణీ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విద్యారంగానికి వేలకోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని తెలిపారు. మన ఊరు మనబడి ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. దీని మూలంగా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు దొరికని పరిస్థితి ఏర్పడిందన్నారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పదవ తరగతి విద్యార్థులందరికీ సొంత ఖర్చుతో అత్యంత విలువైన సమాచారంతో కూడిన స్టడీ మెటీరియల్, పరీక్ష సామాగ్రి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులందరూ మొబైల్స్ ను దూరంగా ఉంచాలని, తల్లితండ్రులు సైతం ఎటువంటి పనులు చెప్పకుండా, పూర్తి సహకారం అందించాలని కోరారు. పదవ తరగతి ఫలితాల పైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గమనించాలని కోరారు. అనంతరం డాక్టర్ సతీష్ మాట్లాడుతూ ఒత్తిడికి గురికాకుండా ఇష్టపడి చదవాలని సూచించడంతోపాటు ఒత్తిడిని అధిగమించే మెలకువలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago