Telangana

రుద్రారం గ్రామం ఖానాపురం ప్రవీణ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మహిళలలకు విద్య,వైద్య,ఉపాధి అవకాశాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తామని ఖానాపురం ప్రవీణ సత్యనారాయణరెడ్డి అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఖనాపురంలో ప్రవీణ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవంను పురస్కరించుకుని మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుందన్నారు . మహిళల రక్షణ కోసం షీ టీమ్ లతో పాటు అనే చట్టాలను రూపొందించిందని గుర్తు చేశారు .తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రాజకీయ రంగంలో మహిళలకు పెద్ద పీట వేసిందన్నారు . పురుషులతో సమానంగా మహిళలకు సమానత్వం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లింగ వివక్ష లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు .

ఈ కార్యక్రమంలో కానాపురం ప్రవీణ సత్యనారాయణ రెడ్డి, పటాన్ చెరు మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, అబ్బగోని సంతోష, కృష్ణవేణి, అక్కమ్మ ,దేవి, శ్రీలత, కళాచారి, భాగ్యలక్ష్మి, అమృతమ్మ, శ్రీకళ, దేవి, బట్టి ఇంద్ర, ఎస్ శ్రీలత, రాణి, దేవి, విజయలక్ష్మి, లావణ్య, జయ శ్రీ, విద్యావతి, నరసమ్మ, మరియు గ్రామ మహిళలు డ్వాక్రా సంఘాల మహిళలు గ్రామ వివిధ సంఘాల నాయకులు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago