Telangana

మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం_ బిఆర్ఎస్ నాయకులు ఎండి అబీద్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మట్టి వినాయకులను పూజించి పర్యావరణంను పరిరక్షిద్దామని బిఆర్ఎస్ నాయకులు ఎండి అభిద్ అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మండలంలోని ముత్తంగి సాయి ప్రియ కాలనీలో వెయ్యి వినాయక ప్రతిమలను కాలనీవాసులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అభిద్ మాట్లాడుతు పర్యావరణాన్ని పరిరక్షించాలని ఉద్దేశంతో నా వంతుగా ప్రతి ఏటా కాలనీవాసులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దీనితోపాటు ప్రతి ఏటా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల కనుగుణంగా సర్వ మతాల పండుగలను సోదరా భావంతో చేసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుందన్నారు. పాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల వల్ల పర్యావరణం విషతుల్యంగా మారి జీవన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడే విధంగా సామాజిక బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మెరాజ్ ఖాన్, పుణ్యవతి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago