Telangana

పండగ సాయన్న స్పూర్తి తో ముందుకు వెళ్దాం_నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పండగ సాయన్న స్ఫూర్తితో ముదిరాజులంతా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ముదిరాజుల ఐక్యత, రాజకీయ ఎదుగుదల కోసం కృషి చేస్తున్న నీలం మధు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని మహబూబాబాద్ జిల్లాలోని పాలకుర్తి,డోర్నకల్,మహబూబాబాద్ అసెంబ్లీ నియోజికవర్గాల ముదిరాజ్ సంఘం నాయకులు ప్రజా ప్రతినిధులు నీలం మదుకు విజ్ఞప్తి చేశారు. వచ్చేనెల 21న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పండగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం తో పాటు ఎన్టీఆర్ స్టేడియంలో 25 వేల మందితో ముదిరాజ్ సింహ గర్జన సభ ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నీలం మధును మహబూబాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగ సాయన్న స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నీలం మధు ముందుండి నడిపించడంతో పాటు ముదిరాజుల రాజకీయ ఐక్యత మరియు రాజకీయ అవకాశాల కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పండగ సాయన్న జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మొదలైన పండగ సాయన్న విగ్రహా ఏర్పాటుకు కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నీలం దుర్గేష్ ముదిరాజ్,జిల్లా అధ్యక్షులు చిల్లా సహదేవ్,కాటా భాస్కర్, రంజిత్,కరుణాకర్,కొత్తూరు రమేష్,అలువాల సోమయ్య,పిట్టల ధనుంజయ్,ఎదరబోయిన సూరయ్య,దుండి వెంకటేశ్వర్లు,గుండా వెంకన్న ,మల్లం యాకయ్య,సాదు రాములు,శీలం సత్యనారాయణ,గడ్డం ఉప్పలయ్య,అలువాల శ్రీకాంత్ ,తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నియోజకవర్గస్థాయి ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…

1 day ago

గీతంలో ఎన్.సీ.సీ.పై అవగాహన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…

1 day ago

మహాత్మ బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం : సమాజంలో అంటరానితనం, వివక్షతకు…

1 day ago

యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం పరిరక్షణకు యోగ అత్యంత అవసరమని ప్రతి ఒక్కరి…

2 days ago

సివిల్ ఇంజనీరింగ్ లో అహ్మద్ మిన్హాజుద్దీన్ కు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

4 days ago

ప్రజల నిర్ణయమే ఫైనల్

అమీన్పూర్ ఎస్టిపిని తరలిస్తాం లేదా రద్దు అవసరమైతే ముఖ్యమంత్రితో సైతం చర్చిస్తాము ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు పై ఎమ్మెల్యే జిఎంఆర్…

4 days ago