Telangana

గీతమ్ ఎన్ సీసీ యూనిట్ ను తనిఖీచేసిన కమాండర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని ఎన్ సీసీ యూనిట్ ను నిజామాబాద్ లోని 33 (తెలంగాణ) బెటాలియన్ ప్రధాన కార్యాలయ కమాండర్ కల్నల్ సునీల్ అబ్రహం శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన వెంట 33 (తెలంగాణ) బెటాలియన్, సంగారెడ్డి కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రమేశ్ సిరియాల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి.మధుసూదనరావు కూడా ఉన్నారు.తనిఖీ సందర్భంగా, కల్నల్ సునీల్ అబ్రహం గీతం ఎన్ సీసీ క్యాడెట్లతో ముఖాముఖి చర్చించడంతో పాటు, వారి అత్యుత్తమ పనితీరును ప్రశంసించారు. ఉన్నత ప్రమాణాలను చేరుకోవడానికి స్థిరమైన శిక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సామాజిక సేవకు మాత్రమే కాకుండా దేశ నిర్మాణంలో కూడా ఇరోధికంగా సహకరిస్తున్న ఎన్ సీసీ ప్రయోజనాలను సహ-పాఠ్య కార్యకలాపంగా ఆయన అభివర్ణించారు. ఎన్ సీసీ సర్టిఫికేట్ కలిగి ఉండడం వల్ల విద్యార్థి బయోడేటా విలువ గణనీయంగా పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలను 30 శాతం పెంచుతుందని, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో వెయిటేజిని అందజేస్తుందని క్యాడెట్రక్కు కల్నల్ వివరించారు. సాయుధ దళాలలో ప్రత్యేక ప్రవేశ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ సీసీ క్యాడెట్లకు పోలీసు ఉద్యోగాలలో ఐదు శాతం వెయిటేజీని మంజూరు చేస్తున్నట్టు కల్నల్ సునీల్ వెల్లడించారు.ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ శిబిరాలలో పాల్గొనడానికి ఎంపికయిన సలువురు గీతం ఎన్ సీసీ క్యాడెట్లను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

మహిత కొండూరి యువత మార్పిడి కార్యక్రమం-2024-25కు ఎంపికై నేపాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.

అబ్దుల్ హదీ పరీక్, నికేత్ సుందరాశెట్టి, మహితా కొండూరి, శిఖా సింగ్ రాథోడ్ లు సర్వీస్ సెలక్షన్
బోర్డ్ శిక్షణా కార్యక్రమానికి ఎంపికయ్యారు.

ఎస్.రిత్విక, కె. కీర్తలు లక్షద్వీప్, కాకినాడలలో నిర్వహించనున్న ప్రత్యేక జాతీయ సమగ్రత శిబిరానికి ఎంపికయ్యారు.

ముకుల్ అస్సాంలోని స్పెషల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ కు ఎంపికయ్యాడు.

గణతంత్ర వేడుకలలో పాల్గొనే వారి తుది విడిత ఎంపిక చేయడం కోసం నిజామాబాద్ నిర్వహించనున్న క్యాంపుకు గోవిందు లిఖిత, ధరణికోట జీశాంతిక, శౌర్య కొండపల్లి ఎంపికయ్యారు. తొలుత, కల్నల్ సునీల్ అబ్రహంను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీసిస్ఎస్ఆర్ వర్మ, ఎన్ సీసీ అధికారి ఎస్. అజయ్ కుమార్ లు స్వాగతించి, సత్కరించారు.

admin

Recent Posts

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

6 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

6 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

6 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

6 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

1 day ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

1 day ago