-గీతం బీ – స్కూల్లో విజయవంతంగా ముగిసిన యాజమాన్య వికాస కార్యక్రమం
మనవార్తలు ,పటాన్ చెరు:
నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని , తుది శ్వాస వరకు అందివస్తున్న ఆధునిక పరిజ్ఞానం , మెళకువలను ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూనే ఉండాలని వక్తలు సూచించారు . గీతం బిజినెస్ స్కూల్ , హైదరాబాద్ లోని ఆగస్టు 2-3 తేదీలలో ‘ సమర్థ పనితీరు ‘ ( “ Performance Excellence ” ) అనే అంశంపై రెండు రోజుల యాజమాన్య వికాస కార్యక్రమాన్ని ( ఎండీపీ ) నిర్వహించారు . ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం హెటిరో ఉన్నతస్థాయి మేనేజర్ల కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమ ముగింపు ఉత్సవం బుధవారం జరిగింది . సిబ్బంది పనితీరు నెపుణ్యం , సంస్థ లక్ష్యాలను సాధించడంలో వారి పాత్ర వంటి ముఖ్యమైన అంశాలపై ఈ ఎంపీడీలో దృష్టి సారించారు . ఇందులో పాల్గొన్న 14 మంది మేనేజర్లు కార్యక్రమ నిర్వహణ , వసతి , ఇతరత్రా ఏర్పాట్లతో పాటు ముఖ్యంగా అద్భుతమైన శిక్షణ పొందిన నెపుణ్యాల గురించి బహుదా ప్రశంసించారు . గీతం బీ – స్కూల్ అధ్యాపకులు డాక్టర్ దివ్య కీర్తి గుప్తా , ప్రొఫెసర్ కృష్ణమోహన్లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడంతో పాటు , అతిథుల ప్రశంసలను కూడా అందుకున్నారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…