-గీతం బీ – స్కూల్లో విజయవంతంగా ముగిసిన యాజమాన్య వికాస కార్యక్రమం
మనవార్తలు ,పటాన్ చెరు:
నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని , తుది శ్వాస వరకు అందివస్తున్న ఆధునిక పరిజ్ఞానం , మెళకువలను ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూనే ఉండాలని వక్తలు సూచించారు . గీతం బిజినెస్ స్కూల్ , హైదరాబాద్ లోని ఆగస్టు 2-3 తేదీలలో ‘ సమర్థ పనితీరు ‘ ( “ Performance Excellence ” ) అనే అంశంపై రెండు రోజుల యాజమాన్య వికాస కార్యక్రమాన్ని ( ఎండీపీ ) నిర్వహించారు . ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం హెటిరో ఉన్నతస్థాయి మేనేజర్ల కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమ ముగింపు ఉత్సవం బుధవారం జరిగింది . సిబ్బంది పనితీరు నెపుణ్యం , సంస్థ లక్ష్యాలను సాధించడంలో వారి పాత్ర వంటి ముఖ్యమైన అంశాలపై ఈ ఎంపీడీలో దృష్టి సారించారు . ఇందులో పాల్గొన్న 14 మంది మేనేజర్లు కార్యక్రమ నిర్వహణ , వసతి , ఇతరత్రా ఏర్పాట్లతో పాటు ముఖ్యంగా అద్భుతమైన శిక్షణ పొందిన నెపుణ్యాల గురించి బహుదా ప్రశంసించారు . గీతం బీ – స్కూల్ అధ్యాపకులు డాక్టర్ దివ్య కీర్తి గుప్తా , ప్రొఫెసర్ కృష్ణమోహన్లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడంతో పాటు , అతిథుల ప్రశంసలను కూడా అందుకున్నారు .
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని పటాన్చెరు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మే 10వ తేదీన పటాన్చెరు పీవీ…
డిస్పెన్సరీలలో డాక్టర్ల కొరతను నివారించాలి సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు…
దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత_ ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ శాస్త్రోక్తంగా మొదలైన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్ చెరు పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా సాయి లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్…