Districts

జిన్నారం లో 2 కోట్ల 20 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం..

_గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వామ్యం కావాలి

_భూములు అమ్ముకోవద్దు..రైతులకు సూచన
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఎనిమిది లక్షల రూపాయల సొంత నిధులతో గ్రామపంచాయతీ కీ ఫర్నిచర్ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,జిన్నారం

గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మండల కేంద్రమైన జిన్నారం లో 60 లక్షల రూపాయల హేట్రో సంస్థ సీఎస్ఆర్ నిధుల తో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. 10 కోట్ల రూపాయలతో ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో జిన్నారం లో నిర్మిస్తున్న మినీ స్టేడియం కోసం కోటి రూపాయలతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 75 లక్షల రూపాయలతో గ్రామ ప్రధాన రహదారి నుండి హనుమాన్ గుడి వరకు నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది లక్షల రూపాయల సొంత నిధులతో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఫర్నిచర్ అందజేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల చేపట్టినప్పుడే వారి నమ్మకానికి సార్థకత చేకూరుతుందన్నారు. చిన్న గ్రామ పంచాయతీల ద్వారా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ సాధ్యమవుతుందన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నూతన గ్రామపంచాయతీలలో శాశ్వత ప్రాతిపదికన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నా లక్ష్యంతో ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

పటాన్ చెరు నియోజకవర్గంలో 3 మినీ స్టేడియాలు నిర్మిస్తుండగా, జిన్నారం లో ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అత్యాధునిక వసతులతో కూడిన స్టేడియం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. జిన్నారం తో పాటు సమీపంలోని అన్ని గ్రామాల ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిన్నారం, గుమ్మడిదల మండలాల అభివృద్ధికి స్థానిక పరిశ్రమల యాజమాన్యాలు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, ప్రజలు భూములు అమ్ముకోవద్దని, భవిష్యత్తులో కోట్ల రూపాయల విలువ రాబోతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే జిఎంఆర్ కు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం కిష్టయ్య పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago