మనవార్తలు ,తెల్లాపూర్:
ఓ పూట ఆకలి తీర్చొచ్చు. విద్యా దానం చేస్తే.. జ్ఞానం పంచొచ్చు. అదే రక్తదానం చేస్తే.. ప్రాణదాతలు కావొచ్చు. అందుకే అన్ని దానాలంటే కంటే రక్తదానం గొప్పదంటారు. రక్తదానం చేయండి చేయించండి అని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రా నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని ఆమె ప్రారంభించారు .అనంతరం కాట సుధా శ్రీనివాస్ గౌడ్ రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం అని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరారు.రక్తదానం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని తెలిపారు. యూత్ సభ్యులు దాదాపుగా 30 మందికి పైగా రక్తదానం చేయడాన్ని కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు ,మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, సి ప్రభాకర్ రెడ్డి, నరసింహ, నరేందర్, సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…