Telangana

ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలి_కాట సుధా శ్రీనివాస్ గౌడ్

మనవార్తలు ,తెల్లాపూర్:

ఓ పూట ఆకలి తీర్చొచ్చు. విద్యా దానం చేస్తే.. జ్ఞానం పంచొచ్చు. అదే రక్తదానం చేస్తే.. ప్రాణదాతలు కావొచ్చు. అందుకే అన్ని దానాలంటే కంటే రక్తదానం గొప్పదంటారు. రక్తదానం చేయండి చేయించండి అని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రా నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని ఆమె ప్రారంభించారు .అనంతరం కాట సుధా శ్రీనివాస్ గౌడ్ రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం అని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్య‌త‌గా ప్రతి మూడు నెలలకు ఒక‌సారి రక్తదానం చేయాలని కోరారు.రక్తదానం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని తెలిపారు. యూత్ సభ్యులు దాదాపుగా 30 మందికి పైగా రక్తదానం చేయడాన్ని  కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు ,మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, సి ప్రభాకర్ రెడ్డి, నరసింహ, నరేందర్, సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago