లక్ష్మీ మంచు యొక్క టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ
షోస్టాపర్గా షో కు నూతనోత్సాహం తీసుకువచ్చిన రియా చక్రవర్తి
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
ఒక మహోన్నత కార్యక్రమం కోసం ఫ్యాషన్ అంటూ గత కొన్నేళ్లుగా నిధుల సేకరణ కార్యక్రమం కోసం వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను ఒకేదరికి తీసుకువచ్చి లక్ష్మీ మంచు నిర్వహిస్తోన్న టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ- 2025 కార్యక్రమం నేడు జరిగింది. మెరుగైన విద్యను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే మహోన్నత లక్ష్యం తో కృషి చేస్తోన్న టీచ్ ఫర్ చేంజ్ , పేద పిల్లలకు అభ్యాస అవకాశాలను మార్చడంలో ముందంజలో ఉంది. ఈ సంవత్సరం మరింత పెద్ద ప్రభావాన్ని చూపడానికి ఇది సిద్దమైనది. తమ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ లో ఉత్సాహంగా జరిగింది. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి షోస్టాపర్గా రన్వే కు కొత్త సొబగులద్దారు.ఈ సంవత్సరం ఫ్యాషన్ షోకేస్లో ప్రఖ్యాత డిజైనర్ స్వాతి వెల్దండి రూపొందించిన అద్భుతమైన కలెక్షన్ ను ప్రదర్శించారు. ఆభరణం నుండి అద్భుతమైన ఆభరణాలు కూడా ఈ షో లో భాగంగా ప్రదర్శించారు. టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా , ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను పెంపొందించాలనే లక్ష్యంతో సినిమా, క్రీడలు మరియు ఫ్యాషన్ రంగాలలోని ప్రముఖ వ్యక్తులు రన్వే పై నడిచారు.అనంతరం నటి లక్ష్మీ మంచు మాట్లాడుతూ, “టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం ఫ్యాషన్ కార్యక్రమం కంటే ఎక్కువ ఇది విద్య ద్వారా జీవితాలను మార్చడానికి కృషి చేసే ఉద్యమం. రియా చక్రవర్తి, స్వాతి వెల్దండి, ఆభరణం తో పాటుగా పరిశ్రమ భాగస్వాములందరి నుండి లభించిన అద్భుతమైన మద్దతు పట్ల మేము చాలా సంతోషంగా వున్నాము. వారి దాతృత్వం, ఓ మహోన్నత కారణం కోసం చూపుతున్న నిబద్ధత అత్యంత అవసరమైన పిల్లలకు మెరుగైన విద్యా అవకాశాలను అందించాలనే మా లక్ష్యానికి తోడ్పడతాయి అని అన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…