– కోకాపేటలో ముదిరాజ్ భవన్ ను నిర్మిస్తా
– ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
రాష్ట్ర ప్రభుత్వం నుండి ముదిరాజ్ కార్పొరేషన్ కు వచ్చే ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే అందిస్తానని ముదిరాజ్ కార్పొరేటర్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ టివోలీ గార్డెన్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ కులస్తుల కోసం ముదిరాజ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిందని ,మన ముదిరాజ్ లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఒక ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ ప్లాట్ ఫామ్ ను ప్రతి ముదిరాజ్ బిడ్డ వినియోగించుకొని ఆర్థికంగా,సామాజికంగా ఎదిగాలన్నారు.కోకాపేట లో 5 ఎకరాల స్థలం ఉందని ఆ స్థలంలో ముదిరాజ్ భవన్ ను కట్టిస్తానని ఆయన వెల్లడించారు.
పార్టీలకతీతంగా ముదిరాజ్ నాయకులంతా ఏకమై ముదిరాజు కులస్తులను ఆర్థికంగా ఎదిగే విధంగా సహాయ సహకారాలు అందించాలన్నారు.ఈ విషయంలో ముదిరాజ్ జర్నలిస్టులు సహకరించి రాష్ట్రంలో ఉన్న పేద ముదిరాజ్ బిడ్డలకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు.గత పాలకులు ముదిరాజ్ కులస్తులను విభజించి పాలించారని, అందుకే మనమంతా వెనుక పడ్డామన్నారు.అనంతరం జర్నలిస్టు సంఘం నాయకులు చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను ఘనంగా సన్మానించి సత్కరించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం గౌరవ అధ్యక్షులు బలరాం,రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు చింతల నీలకంఠం,ప్రధాన కార్యదర్శి బోయిన శ్రీనివాస్,రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల శ్రీనివాస్, సాయన్న,రెడ్డబోయిన హరికుమార్, గోనెల కుమార్ గడ్డమీద శ్రీశైలం, ,ఇండస్ట్రీ అధ్యక్షుడు ప్రభాకర్,అడ్వకేట్ ముదిరాజ్ సంఘం వినోద్ కుమార్,మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సుగ్రీవుడు,రాష్ట్రం ముదిరాజ్ జర్నలిస్టు సంఘం నాయకులు సతీష్, శివ, మల్లికార్జున్ ,భూమయ్య, శివన్న, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…