కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్న ఎల్.రమణ…
-16న హుజూరాబాద్ సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా
-ఇటీవలే కేసీఆర్ ను కలిసిన అనంతరం టీడీపీకి రాజీనామా
హైదరాబాద్:
టీడీపీ తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా సాదాసీదాగా వెళ్లి ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆయనకు సభ్యత్వం ఇచ్చిన కేటీఆర్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
కేసీఆర్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తోపాటు వెళ్లి కలిశారు . ఆ సందరభంగా ముఖ్యమంత్రి పార్టీలోకి ఆహ్వానించడం , ఆయన అందుకు సమ్మతి తెలపడం జరిగిపోయాయి.
ఎల్.రమణతో పాటు పలు సంఘాల నేతలు, ఆయన మద్దతుదారులు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. పార్టీ మారడంపై ప్రగతిభవన్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవల రమణ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.రమణ ఆ పార్టీలో తన ప్రస్థానాన్ని ముగించారు.
కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరినప్పటికీ ఈనెల 16న హుజూరాబాద్ లో జరిగే ముఖ్యమంత్రి సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు. రమణతోపాటు మరికొందరు ,టీడీపీ నేతలు టీఆర్ఎస్లో చేరనున్నట్టు తెలుస్తోంది.
రమణ టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తొలుత ఈ వార్తలను ఖండించిన ఆయన గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. తన ఎదుగుదలకు 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు అందులో హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…