Hyderabad

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేర‌నున్న‌ ఎల్.ర‌మ‌ణ…

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేర‌నున్న‌ ఎల్.ర‌మ‌ణ…
-16న హుజూరాబాద్ సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా
-ఇటీవలే కేసీఆర్ ను కలిసిన అనంతరం టీడీపీకి రాజీనామా

హైదరాబాద్:

టీడీపీ తెలంగాణ‌ పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన ఎల్.రమణ ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా సాదాసీదాగా వెళ్లి ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆయ‌న‌కు స‌భ్య‌త్వం ఇచ్చిన కేటీఆర్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాల‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు టీఆర్ఎస్ నేత‌లు పాల్గొన్నారు.

కేసీఆర్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తోపాటు వెళ్లి కలిశారు . ఆ సందరభంగా ముఖ్యమంత్రి పార్టీలోకి ఆహ్వానించడం , ఆయన అందుకు సమ్మతి తెలపడం జరిగిపోయాయి.

ఎల్‌.ర‌మ‌ణ‌తో పాటు ప‌లు సంఘాల నేత‌లు, ఆయ‌న‌ మ‌ద్ద‌తుదారులు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. పార్టీ మార‌డంపై ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవ‌ల‌ ర‌మ‌ణ చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.ర‌మ‌ణ ఆ పార్టీలో త‌న ప్ర‌స్థానాన్ని ముగించారు.
కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరినప్పటికీ ఈనెల 16న హుజూరాబాద్ లో జరిగే ముఖ్యమంత్రి సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు. రమణతోపాటు మరికొందరు ,టీడీపీ నేతలు టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది.

రమణ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తొలుత ఈ వార్తలను ఖండించిన ఆయన గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. తన ఎదుగుదలకు 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు అందులో హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Venu

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

15 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

16 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago