మనవార్తలు ,పటాన్ చెరు :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో బుధవారం కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జిల్లా అధికారుల సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15–18 ఏళ్ళ మధ్య వయస్కులకు టీకాలు వేయడంతో పాటు వయోజనులకు కోవాక్సిన్ రెండో డోసు ఇచ్చారు . 15 నుంచి 18 ఏళ్ళ పిల్లలకు టీకాలు వేయాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు విరివిగా పాల్గొనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు . 15 నుంచి 60 ఏళ్ళ వయస్సు గల వారు టీకా డ్రైవైకు హాజరై అది విజయవంతం కావడానికి తమవంతు సహాయ సహకారాలను అందజేశారు . భానూరు పీహెచ్సీ డాక్టర్ స్వప్న , జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి పెంటయ్యలు ఈ కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమానికి స్వయంగా హాజరై పర్యవేక్షించారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…