మనవార్తలు ,పటాన్ చెరు :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో బుధవారం కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జిల్లా అధికారుల సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15–18 ఏళ్ళ మధ్య వయస్కులకు టీకాలు వేయడంతో పాటు వయోజనులకు కోవాక్సిన్ రెండో డోసు ఇచ్చారు . 15 నుంచి 18 ఏళ్ళ పిల్లలకు టీకాలు వేయాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు విరివిగా పాల్గొనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు . 15 నుంచి 60 ఏళ్ళ వయస్సు గల వారు టీకా డ్రైవైకు హాజరై అది విజయవంతం కావడానికి తమవంతు సహాయ సహకారాలను అందజేశారు . భానూరు పీహెచ్సీ డాక్టర్ స్వప్న , జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి పెంటయ్యలు ఈ కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమానికి స్వయంగా హాజరై పర్యవేక్షించారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…