మనవార్తలు ,పటాన్ చెరు :
దశాబ్దాలుగా రాళ్ళు కొట్టి జీవనం సాగిస్తున్న వడ్డెర కులస్తులు నేడు క్రషర్ ల వల్ల జీవనాధారం కొల్పోతున్నారని పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు బుధవారం కర్మాన్ ఘాట్ లో జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) సభ్యులు తల్లోజు ఆచారిని కలిసి క్రషర్ కంపెనీలపై ఫిర్యాదు చేశారు.
పటాన్ చెరువు నియోజకవర్గంలో అనేక క్రషర్ కంపెనీలు ఉన్నాయని ఆ కంపెనీలు చుట్టుపక్కల వడ్డెర కులస్తులను రాళ్ళు కొట్టుకోనియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులు, రెవెన్యూ అధికారులు ,అక్రమ మైనింగ్ చేస్తున్న క్రషర్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ నిరక్షరాస్యులైన వడ్డెర కులస్తులను పని చేయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వీటి వల్ల వడ్డెర కులస్తులకు జీవనాధారం లేకుండా పోయిందని, క్రషర్ కంపెనీలు వడ్డెర కులస్తులను అణిచివేస్తున్నారని ,
వెంటనే బీసీ కమిషన్ జోక్యం చేసుకుని వడ్డెర కులస్తులను ఆదుకోవాలని ,వడ్డెర కులస్తులకు కూడా రాళ్ళు కొట్టుకునే హాక్కును కల్పించాలని పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…