మనవార్తలు ,పటాన్ చెరు;
దక్షిణ కొరియా ప్రభుత్వ మద్దతుతో , ఇండో – కొరియన్ ప్రాజెక్టులో భాగంగా గీతమ్ హెదరాబాద్లో ఏర్పాటు చేసిన నాలుగు విండ్ టర్బెన్లను నలుగురు సభ్యులతో కూడిన కొరియా బృందం బుధవారం సందర్శించింది . గాలి వేగాన్ని పర్యవేక్షించడం , స్వదేశీ – కొరియా నమూనాల పనితీరును పోల్చడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ తెలియజేశారు . ముఖ్యంగా ఈ ప్రాజెక్టు నిర్వహణలో తలెత్తే సాంకేతిక సమస్యలను గీతం నిపుణులు పరిష్కరిస్తారని చెప్పారు . ఆర్కిమెడిస్ విండ్ టర్నెన్లను ఎక్కడ ఉంచినా , ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే డేటాను విశ్లేషించడానికి ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని గీతం యోచిస్తోందన్నారు .
ఈ ప్రాజెక్టు కోసం ఎస్కో – ఆర్టీఎస్ , చెంజూ విశ్వవిద్యాలయం , జేఐఎస్ , గీతం , ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు డాక్టర్ శ్రీనివాస్ వివరించారు . ప్రాజెక్టు ప్రధాన పరిశోధకుడు బీక్ జూన్ హో నేతృత్వంలో రినస్ మెరిమాట్యూస్ , యాంగ్ , కిమ్లతో కూడిన ఎస్కో – ఆర్టీఎస్ , కొరియా ప్రతినిధుల బృందం గీతమన్ను సందర్శించి , గాలి టర్బెన్లను విజయవంతంగా అమర్చిన స్థానిక పరిశోధకులను అభినందించినట్టు డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు .
గీతం ఉపకులపతి దయానంద సిద్దవటం , గీతం – హెదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్ . సీతారామయ్యలను ఈ బృందం కలిసినట్టు చెప్పారు . స్థానిక ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ కె.రాజగోపాల్ , ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీ సీఈవో – ఎండీ సూర్యప్రకాష్ గజ్జల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు . కాగా , గీతం పరిశోధనా సమన్వయకర్త డాక్టర్ ఐవీ సుబ్బారెడ్డి , అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పీవీ రామకృష్ణ , శ్రీ వీకే శ్రీధర్లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసినట్టు ఆయన పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…