Telangana

ప్రజలకు అందుబాటులో వైద్యం అందించేందుకు బస్తీ దవాకనాలు ఏర్పాటు చేశాం_మంత్రి హరీష్ రావు

మనవార్తలు ,అమీన్ పూర్:

ప్రజాఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని అనటానికి నిదర్శనం బస్తీ దవాఖానాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.అమీన్ పూర్ లో బస్తీ దవాఖాన నూతన భవనాన్ని మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్తీ దవాఖానాలు ప్రజల సుస్తిని పోగెట్టుఎందుకు పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు మందులు అందుతున్నాయని అన్నారు.నిరుపేద నీడలో మెరుగైన వైద్య సౌకర్యం ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

బస్తీ దవాఖానాల్లో అవుట్​ పేషెంట్​ సేవలు అందించడం సహా బీపీ, షుగర్​తో పాటు 57 రకాల వైద్య పరీక్షలను చేస్తారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తామని ఇక పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లో బస్తీ దవాఖాన ఎంతో దోహదపడుతుందని మంత్రి హరీష్ రావ్ అన్నారు .57 రకాల రక్త పరీక్షలు చేస్తాం..మెసేజ్ రూపంలో రిపోర్ట్స్ పంపిస్తాం..ఉచితంగా మందులు అందిస్తాం ఆదివారం సైతం పని చేస్తుంది అని ,బీపీ షుగర్ ఉన్న వారికి నెలకు సరిపడా మందులు అందిస్తామని ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామని అన్నారు .

ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవల పై ప్రజల్లో అవగాహన కలిపించాలని, నార్మల్ డెలివరీలు జరిగేల చూడాలని ఆశ , ఏ ఎన్ ఎం లను మంత్రి హరీష్ రావు గారు సూచించారు. ప్రజలు ప్రయివేటు ఆసుపత్రి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.2 కోట్ల 20 లక్షల అంచనా వ్యయంతో పటాన్ చెరు ఆస్పత్రిలో సిటి స్కాన్ ఏర్పాటు చేశాం,18 మంది డాక్టర్ల ను ఏర్పాటు చేశాం, ముహూర్తాల పేరుతో సీజరియాన్ ఆపరేషన్లు చేసుకుంటున్నారు. ఇది మంచి పద్దతి కాదు అని తెలిపారు .త్వరలో పటాన్ చెరులో 200 పడకలు అత్యాధునిక వసతులు ఆధునిక శస్త్ర చికిత్సలు.దీంతోపాటు ప్రధానంగా పారిశ్రామికవాడల్లో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అవసరమైన అత్యాధునిక శస్త్ర చికిత్స విభాగాలు సైతం ఇందులో ఉంటాయని ,త్వరలో సీఎం కెసిఆర్ తో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

 

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago