నేటి తరానికి ఆదర్శప్రాయుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు
తెలంగాణ ఉద్యమానికి ఆది గురువైన కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేయనున్న బాపూజీ కాంస్య విగ్రహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తన జీవితాన్ని తెలంగాణకు, ప్రజాసేవకే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి బాపూజీ అన్నారు.
ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో శాసన సభ్యుడిగా పని చేయడంతో పాటు మలి విడత తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని బాపూజీ నివాసమైన జలదృశ్యం నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. అంతటి మహనీయుని కాంస్య విగ్రహాన్ని తన సొంత నిధులచే పటాన్చెరులో ఏర్పాటు చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ పటాన్చెరులో బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు.
శాసనసభ్యుడిగా, న్యాయవాదిగా ఉద్యమకారుడిగా, మానవతా వాదిగా బాపూజీ సమాజానికి చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, నగేష్ యాదవ్, వెంకటేష్ గౌడ్, గూడెం మధుసూదన్ రెడ్డి, పరమేష్, రాజేష్, గోవింద్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పద్మశాలి సంఘం ప్రతినిధులు రాజ మల్లయ్య, రమేష్, కంకర శీను, యాదగిరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…