Hyderabad

భరతమాత సేవలో తరించిన కర్మయోగి అటల్ బిహారి వాజ్ పేయి – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పెట్ డివిజన్ బీజేపీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని వాజపేయి చిత్ర పట్టనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జాతీయత, ఉదాత్తత, మానవత కలగలిసిన మేరుశిఖరమని ప్రత్యర్థులను సైతం తన వాగ్దాటితో మంత్రముగ్దులను చేయడమే కాకుండా రాజకీయాలను కవిత్వాన్ని సమతూకం చేస్తూ దేశ రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా నిలిచిన మహనీయులు అని అన్నారు.

బిజెపి పార్టీని స్థాపించి అదికారాన్ని సాదించి భారత ప్రధానిగా దేశాన్ని దేవాలయంగా సమాజాన్ని కుటుంబంగా కనీసం సొంత ఇల్లు కూడా లేని బ్రమ్మచారిగా అహర్నిశలు భరతమాత సేవలో తరించిన కర్మయోగి అని అన్నారు.భారతీయ జనతా పార్టీ మెరు శిఖరం, బీజేపీ కార్యకర్తలకు మార్గ దర్శకులు,స్ఫూర్తి ప్రధాత అటల్ బిహారి వాజ్ పేయి అని కొనియాడారు.అలాంటి మహోతన్నత వ్యక్తిత్వం చాలా అరుదుగా ఉంటుందని ఆయన దేశానికి చేసిన సేవలు ప్రజలు ఎన్నటికి మారువరని ఇప్పుడున్న కార్యకర్తలకు,యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు మనోహర్,రవి గౌడ్, వర ప్రసాద్,మణిక్ రావు, బాబు రెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్, కళ్యాణ్, రామకృష్ణ, విజేందర్, గణేష్ ముదిరాజ్, జాజిరావ్ శ్రీను, వినోద్ యాదవ్, అంజయ్య,నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

3 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago