Hyderabad

గంగల రాధాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం

శేరిలింగంపల్లి :

మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు స్థానిక బిజెపి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పై చేసిన దాడిని నిరసిస్తూ సోమవారం రోజు మాదాపూర్ డివిజన్ కాoటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఖానామేట్ చౌరస్తాలో మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. అనంతరం రాధా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన నీకు అంత అధికారం మదం అహంకారం గర్వం ఉండకూడదని,అలాగే పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అయిన బండి సంజయ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేకపోతే నిరసన తీవ్రతరo చేస్తామని హెచ్చరించారు.

 

బండి సంజయ్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్, స్వాతంత్ర్య సమరయోధులు అయిన గాంధీజీ ఫోటోలను తన్నుతూ బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ పై బీరు బాటిల్స్ తో దాడి చేయడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను అరికట్టాలని, ఇదంతా కేసీఆర్ డైరెక్షన్లోనే జరుగుతుందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైనంపల్లి చేసిన భూకబ్జాలు భూ దందాలు అలాగే నాలాలపై ఫంక్షన్ హాల్ నిర్మించి అమ్ముకున్న దౌర్జన్యాలు బయటపడతాయని, వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా బండి సంజయ్ మీద ఎదురు విమర్శలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ కార్యక్రమం లో మాదాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, మధుయాదవ్,ప్రధాన కార్యదర్శులు మదనాచారి, శివ శ్రీనివాస్, కార్యదర్శులు గోవర్ధన్ రెడ్ది, కొండయ్య,ఓబీసీ ప్రెసిడెంట్ కృష్ణగౌడ్, ప్రధాన కార్యదర్శి సత్యం చారి మరియు మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు చంద్రకళ మరియు ప్రధాన కార్యదర్శి భారతి, మరియు బీజేవైఎం అధ్యక్షులు ఆనంద్, కార్యదర్శి నరేష్ రెడ్డి, శివాయాదవ్, గంగాధర్, కొండయ్య యాదవ్, దీపాల కొండయ్య, ఎస్టీ సెల్ నాయకులు బాలు నాయక్, కృష్ణ నాయక్, నాగరాజు,మరియు బాలమ్మ,మరియు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాద బాధితులకు పూర్తి న్యాయం చేయాలి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి మెట్టు శ్రీధర్ విజ్ఞప్తి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: 2025 జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన ఘోర…

11 hours ago

సిద్ధార్థ నగర్ కాలని సంక్షేమ సంఘం ఎన్నికలు

గౌరవ సలహాదారుగా చుక్కా రాములు గౌరవ అధ్యక్షులుగా పాండు రంగా రెడ్డి అధ్యక్షులుగా ఉపేందర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

11 hours ago

కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లినట్లే.. పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన అమలు…

11 hours ago

యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఘన విజయం

మనవార్తలు ప్రతినిధి , మియాపూర్: సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యలమంచి ఉదయ్…

1 day ago

బిఆర్ఎస్ లో చేరిన భానూరు కాంగ్రెస్ కీలక నాయకులు, వార్డు సభ్యురాలు..

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు…

1 day ago

నిండు జీవితానికి రెండు చుక్కలు

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: దేశ వ్యాప్త పల్స్…

1 day ago