Telangana

సిద్ధార్థ నగర్ కాలని సంక్షేమ సంఘం ఎన్నికలు

గౌరవ సలహాదారుగా చుక్కా రాములు

గౌరవ అధ్యక్షులుగా పాండు రంగా రెడ్డి

అధ్యక్షులుగా ఉపేందర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్ చెరు సర్కిల్ ముత్తంగి డివిజన్ కార్దనూర్ లోని సిద్ధార్థ నగర్ కాలనీలో ఆదివారం అధ్యక్షులు మనోహర్ అధ్యక్షత జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగాయి. కాలనీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా కాలనీ గౌరవాధ్యక్షులు పాండురంగారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రెటరీ ఎస్ ఉపేందర్ 2022వ సంవత్సరం నుండి 2026 జూన్ వరకు జరిగిన కాలని కార్య కలాపాలు జనరల్ బాడీ సమావేశంలో వివరించడం జరిగింది. జమ ఖర్చుల వివరాలను సభ్యులకు వివరించిన అనంతరం సమావేశంలో కార్యకలాపాల జమా ఖర్చుల వివరాలకు ఆమోదం తెలుపటం జరిగింది.

జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు
కాలనీలో వాచ్ మెన్ రూము నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు చేయటం వంటి తీర్మానాలు చేపట్టారు.

కాలని సంక్షేమ సంఘం ఏకగ్రీవ ఎన్నిక

గౌరవ సలహాదారుగా చుక్కా రాములు,గౌరవ అధ్యక్షులుగా పాండు రంగా రెడ్డి,సలహాదారుగా శ్రీనివాస్,కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎస్ ఉపేందర్,ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గా బాల్ రెడ్డి,కోశాధికారిగా మణికంఠన్,సంయుక్త కార్యదర్శులుగా సయ్యద్ కరిం, శ్రీహరి రెడ్డి,కమిటీ సభ్యులుగా ఆర్ నరేందర్ రెడ్డి,ఎస్ మహేష్, బి మల్లయ్య, ఎం బాలకృష్ణ, విసి సంతోష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ సిద్ధార్థ కాలనీ సంక్షేమం కోసం అందరి సహాయ సహకారాలతో కాలనీ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు.

admin

Recent Posts

సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాద బాధితులకు పూర్తి న్యాయం చేయాలి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి మెట్టు శ్రీధర్ విజ్ఞప్తి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: 2025 జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన ఘోర…

2 hours ago

కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లినట్లే.. పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన అమలు…

2 hours ago

యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఘన విజయం

మనవార్తలు ప్రతినిధి , మియాపూర్: సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యలమంచి ఉదయ్…

24 hours ago

బిఆర్ఎస్ లో చేరిన భానూరు కాంగ్రెస్ కీలక నాయకులు, వార్డు సభ్యురాలు..

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు…

24 hours ago

నిండు జీవితానికి రెండు చుక్కలు

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: దేశ వ్యాప్త పల్స్…

24 hours ago

సొంత నిధులతో 12 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహం

ఆల్విన్ కాలనీ చౌరస్తాలో భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేటి తరం యువత శివాజీ మహారాజ్ జీవితాన్ని…

24 hours ago