Telangana

సిద్ధార్థ నగర్ కాలని సంక్షేమ సంఘం ఎన్నికలు

గౌరవ సలహాదారుగా చుక్కా రాములు

గౌరవ అధ్యక్షులుగా పాండు రంగా రెడ్డి

అధ్యక్షులుగా ఉపేందర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్ చెరు సర్కిల్ ముత్తంగి డివిజన్ కార్దనూర్ లోని సిద్ధార్థ నగర్ కాలనీలో ఆదివారం అధ్యక్షులు మనోహర్ అధ్యక్షత జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగాయి. కాలనీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా కాలనీ గౌరవాధ్యక్షులు పాండురంగారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రెటరీ ఎస్ ఉపేందర్ 2022వ సంవత్సరం నుండి 2026 జూన్ వరకు జరిగిన కాలని కార్య కలాపాలు జనరల్ బాడీ సమావేశంలో వివరించడం జరిగింది. జమ ఖర్చుల వివరాలను సభ్యులకు వివరించిన అనంతరం సమావేశంలో కార్యకలాపాల జమా ఖర్చుల వివరాలకు ఆమోదం తెలుపటం జరిగింది.

జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు
కాలనీలో వాచ్ మెన్ రూము నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు చేయటం వంటి తీర్మానాలు చేపట్టారు.

కాలని సంక్షేమ సంఘం ఏకగ్రీవ ఎన్నిక

గౌరవ సలహాదారుగా చుక్కా రాములు,గౌరవ అధ్యక్షులుగా పాండు రంగా రెడ్డి,సలహాదారుగా శ్రీనివాస్,కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎస్ ఉపేందర్,ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గా బాల్ రెడ్డి,కోశాధికారిగా మణికంఠన్,సంయుక్త కార్యదర్శులుగా సయ్యద్ కరిం, శ్రీహరి రెడ్డి,కమిటీ సభ్యులుగా ఆర్ నరేందర్ రెడ్డి,ఎస్ మహేష్, బి మల్లయ్య, ఎం బాలకృష్ణ, విసి సంతోష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ సిద్ధార్థ కాలనీ సంక్షేమం కోసం అందరి సహాయ సహకారాలతో కాలనీ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago