Telangana

సొంత నిధులతో 12 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహం

ఆల్విన్ కాలనీ చౌరస్తాలో భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

నేటి తరం యువత శివాజీ మహారాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

నియోజకవర్గ వ్యాప్తంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల ఏర్పాటు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

నేటి తరం యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్న సమున్నత లక్ష్యంతో పటాన్‌చెరు నియోజకవర్గం వ్యాప్తంగా శివాజీ మహారాజ్ మహనీయుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఆదివారం జెపి కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ చౌరస్తాలో సొంత నిధులతో ఏర్పాటు చేయనున్న 12 అడుగుల చత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశభక్తి, ధైర్యసాహసాలు, స్వరాజ్య స్థాపనకు ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ధర్మరక్షణ, ప్రజాపాలన, మహిళల గౌరవ పరిరక్షణ, పరిపాలనా దక్షతలో శివాజీ మహారాజ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సొంత నిధులతో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తూ, ఆయన గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెప్పే కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.రాబోయే మూడు నెలల్లోగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, శివాజీ అభిమానులు, యువకులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విగ్రహ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago