Telangana

కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లినట్లే.. పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. ఆదివారం సాయంత్రం పటాన్‌చెరు మండలం భానూరు గ్రామంలో ఇటీవల బిఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు ప్రవళిక నరేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరచితలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. అతి త్వరలో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. ప్రభుత్వం సహకరించక పోయిన నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని తెలిపారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుని ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని.. ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టతకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్, సాగర్, శివయ్య, నాగేష్, మధు, రవి, సత్తయ్య, మాణిక్యం, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాద బాధితులకు పూర్తి న్యాయం చేయాలి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి మెట్టు శ్రీధర్ విజ్ఞప్తి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: 2025 జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన ఘోర…

2 hours ago

సిద్ధార్థ నగర్ కాలని సంక్షేమ సంఘం ఎన్నికలు

గౌరవ సలహాదారుగా చుక్కా రాములు గౌరవ అధ్యక్షులుగా పాండు రంగా రెడ్డి అధ్యక్షులుగా ఉపేందర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

2 hours ago

యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఘన విజయం

మనవార్తలు ప్రతినిధి , మియాపూర్: సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యలమంచి ఉదయ్…

24 hours ago

బిఆర్ఎస్ లో చేరిన భానూరు కాంగ్రెస్ కీలక నాయకులు, వార్డు సభ్యురాలు..

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు…

24 hours ago

నిండు జీవితానికి రెండు చుక్కలు

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: దేశ వ్యాప్త పల్స్…

24 hours ago

సొంత నిధులతో 12 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహం

ఆల్విన్ కాలనీ చౌరస్తాలో భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేటి తరం యువత శివాజీ మహారాజ్ జీవితాన్ని…

24 hours ago