Telangana

జ్యోతి విద్యాలయ విద్యార్థులు ప్రభంజనం టెన్త్ ఫలితాల్లో సత్తా

మనవార్తలు ,శేరిలింగంపల్లి :

ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో ఎప్పటి లాగే బీహెచ్ ఈ ఎల్ జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు తమ సత్తా చాటారు. పెరుగుతున్న పోటీని తట్టుకుంటు, వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాబోధన చేస్తూ అధ్యాపక బృందం విద్యార్థులను చక్కటి మార్గంలో నడిపిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నది జ్యోతి విద్యాలయ హై స్కూల్. సి బి ఎస్ సి సిలబస్ తో, విశాలమైన ప్లే గ్రౌండ్ తో విద్యార్థులకు అన్ని రకాల క్రీడల్లోనూ శిక్షణనిస్తున్నారు. చదువుతో పాటు వివిధ రకాల క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ పథకాలు సాధించారు. ప్రతీ సంవత్సరం పదోతరగతి ఫలితాల్లో తిరుగులేని విజయడంఖా మోవిస్తూ దూసుకుపోతుంది. ఈ సంవత్సరం మొత్తం 84 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయగా అందులో జి. జయస్వీ, బశిరత్ ఉన్నిసా లు 10 జిపిఏ సాధించారు. నలుగురు విద్యార్థులు 9.8, ముగ్గురు 9.7, ఐదుగురు 9.5, ముగ్గురు 9.2, నలుగురు 9.0 జిపిఏ సాధించి విజయడంఖా మోగించారు. అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదు అన్నట్లు విజయం సాధించారు. ఇదే ఉత్సాహం తో ముందు ముందు మరిన్ని విజయాలు సాధిస్తామని ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరీ తెలిపారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago