మనవార్తలు ,రామచంద్రపురం:
ప్రజలందరి ప్రాణాలను కాపాడటానికి, ప్రజల ఆరోగ్యాలను ఎల్లప్పుడూ కాపాడేందుకు ఎంతగానో శ్రమించే హీరోలే వైద్యులు అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగ రామచంద్రాపురం ఈఎస్ఐ హాస్పిటల్ మరియు ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యులందరికి అందరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు .అనంతరం వైద్య సిబ్బందిని పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు .
ఈ సంధర్బంగా ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ మాట్లాడుతూ వైద్యో నారాయణ హరి అంటారు దేవుడు మనకు జన్మనిస్తే ,వైద్యుడు పునర్జన్మనిస్తాడు ప్రస్తుతం దేశాన్ని అల్లోకాల్లోలం చేసిన కరోనా పరిస్థితుల్లో వైద్యులే పోరాటం చేసి ఎందరో ప్రాణాలను కాపాడారు ,రోగి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తమ ప్రాణాలను కుడా లెక్కచేయరని అందుకే ప్రతి సంవత్సరం జులై 1న డాక్టర్స్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందో అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తెలిపారు .ఈ కార్యక్రమంలో ఏకె ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్,అబ్దుల్ గఫార్, కృష్ణమూర్తి చారి, శివ కుమార్, అబ్దుల్ సమీ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…