Telangana

శివాజీ జయంతి సందర్భంగా జర్నలిస్టులకు ఘన సన్మానం

– ఘనంగా నిర్వహించిన భాగ్యనగర్ శివాజీ సేవాసమితి

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

శివాజీ మహారాజ్ పరిపాలనలో ఉన్న న్యాయం, ప్రజా సంక్షేమ దృక్పథం, స్వాభిమాన భావం నేటి తరానికి ఎంతో అవసరమని ఆయన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు .కుత్బుల్లాపూర్‌లో భాగ్యనగర్ శివాజీ సేవాసమితి వెల్ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని శివాజీ మహారాజ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జర్నలిస్టులను సన్మానించారు . అనంతరం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సమాజంలో అవగాహన పెంపొందించడంలో, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి జర్నలిస్టులు నిష్పక్షపాత ధోరణితో పనిచేయాలని సూచించారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ చూపిన పరిపాలనా నైపుణ్యం, సాహసస్ఫూర్తి ప్రతి నాయకుడికి ఆదర్శమని అన్నారు. మీడియా సమాజానికి దారిదీపంలా పనిచేస్తోందని, విలువల ఆధారిత జర్నలిజం సమాజ అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మధ్యవి మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ చరిత్రను యువతలో విస్తృతంగా పరిచయం చేయడంలో మీడియా పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయ గౌరవం పరిరక్షణలో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌లను శాలువాలు, స్మారక చిహ్నాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర, ఆయన యుద్ధ వ్యూహాలు, ప్రజా పరిపాలనలో చేసిన సంస్కరణలపై ప్రత్యేక ప్రసంగాలు నిర్వహించారు. దేశభక్తి గీతాలతో కార్యక్రమానికి ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.శివాజీ జయంతి సందర్భంగా జర్నలిస్టులకు నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన పొందింది. సమాజానికి సేవలందిస్తున్న మీడియా ప్రతినిధులను గౌరవించడం ద్వారా శివాజీ మహారాజ్ స్ఫూర్తిని ఆచరణలో నిలబెట్టినట్లయిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago