Telangana

శివాజీ జయంతి సందర్భంగా జర్నలిస్టులకు ఘన సన్మానం

– ఘనంగా నిర్వహించిన భాగ్యనగర్ శివాజీ సేవాసమితి

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

శివాజీ మహారాజ్ పరిపాలనలో ఉన్న న్యాయం, ప్రజా సంక్షేమ దృక్పథం, స్వాభిమాన భావం నేటి తరానికి ఎంతో అవసరమని ఆయన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు .కుత్బుల్లాపూర్‌లో భాగ్యనగర్ శివాజీ సేవాసమితి వెల్ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని శివాజీ మహారాజ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జర్నలిస్టులను సన్మానించారు . అనంతరం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సమాజంలో అవగాహన పెంపొందించడంలో, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి జర్నలిస్టులు నిష్పక్షపాత ధోరణితో పనిచేయాలని సూచించారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ చూపిన పరిపాలనా నైపుణ్యం, సాహసస్ఫూర్తి ప్రతి నాయకుడికి ఆదర్శమని అన్నారు. మీడియా సమాజానికి దారిదీపంలా పనిచేస్తోందని, విలువల ఆధారిత జర్నలిజం సమాజ అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మధ్యవి మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ చరిత్రను యువతలో విస్తృతంగా పరిచయం చేయడంలో మీడియా పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయ గౌరవం పరిరక్షణలో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌లను శాలువాలు, స్మారక చిహ్నాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర, ఆయన యుద్ధ వ్యూహాలు, ప్రజా పరిపాలనలో చేసిన సంస్కరణలపై ప్రత్యేక ప్రసంగాలు నిర్వహించారు. దేశభక్తి గీతాలతో కార్యక్రమానికి ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.శివాజీ జయంతి సందర్భంగా జర్నలిస్టులకు నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన పొందింది. సమాజానికి సేవలందిస్తున్న మీడియా ప్రతినిధులను గౌరవించడం ద్వారా శివాజీ మహారాజ్ స్ఫూర్తిని ఆచరణలో నిలబెట్టినట్లయిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago