పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి…
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో చైర్మన్ తో పాటు సభ్యుల పేర్లను ప్రకటించారు. చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి .జనార్దన్ రెడ్డిని నియమించారు. మిగతా సభ్యులను కూడా ప్రకటించారు. టి ఎం జి ఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కి కూడా అందులో ప్రాతినిధ్యం కల్పించటం విశేషం . తెలంగాణ రాష్ట్రంలో లక్ష 93 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఇప్పటికే నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది . పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు యువత లో ఆశలు చిగురింప చేసింది . అందులో కమిషన్ చైర్మన్ గా ఐఏఎస్ ను నియమించటం పై కూడా సానుకూల వ్యాఖ్యానాలే వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం సత్వర చర్యలు తీసుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి .
సభ్యుల వివరాలు …..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్, సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్…టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి డాక్టర్. బి. జనార్ధన్ రెడ్డి,టీఎస్ పీఎస్సీ సభ్యులుగా మరో ఏడుగురు నియామకం సభ్యులుగా రామావత్ ధన్ సింగ్,బి.లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి,డా.ఆరవెళ్లి చంద్రశేఖర్రావు,ఆర్.సత్యనారాయణ,కారం రవీందర్ రెడ్డి,సుమిత్రా ఆనంద్.
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…
అమీన్పూర్లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…