Hyderabad

పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి…

పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి…

హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో చైర్మన్ తో పాటు సభ్యుల పేర్లను ప్రకటించారు. చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి .జనార్దన్ రెడ్డిని నియమించారు. మిగతా సభ్యులను కూడా ప్రకటించారు. టి ఎం జి ఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కి కూడా అందులో ప్రాతినిధ్యం కల్పించటం విశేషం . తెలంగాణ రాష్ట్రంలో లక్ష 93 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకున్నది.

ఇప్పటికే నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది . పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు యువత లో ఆశలు చిగురింప చేసింది . అందులో కమిషన్ చైర్మన్ గా ఐఏఎస్ ను నియమించటం పై కూడా సానుకూల వ్యాఖ్యానాలే వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం సత్వర చర్యలు తీసుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి .

సభ్యుల వివరాలు …..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్, సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్…టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి డాక్టర్. బి. జనార్ధన్ రెడ్డి,టీఎస్ పీఎస్సీ సభ్యులుగా మరో ఏడుగురు నియామకం సభ్యులుగా రామావత్ ధన్ సింగ్,బి.లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి,డా.ఆరవెళ్లి చంద్రశేఖర్రావు,ఆర్.సత్యనారాయణ,కారం రవీందర్ రెడ్డి,సుమిత్రా ఆనంద్.

Venu

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

20 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

22 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago