పటాన్ చెరు
పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామపంచాయతీ పరిధిలోని మంగళవారం రోజు జాతీయ రహదారి పక్కన నిర్మాణాలను తొలగించడం సరియైంది కాదని, మా సొంత పట్టా భూముల్లోనే నిర్మాణాలు చేపట్టామని బాధితులు ముత్తంగి గ్రామానికి చెందిన గడ్డ యాదయ్య, పుణ్యవతి తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మా పెద్దలు సంపాదించిన పట్టా భూమి ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 528 లో కొన్ని షాపులు నిర్మాణాలు చేపట్టామని అన్నారు. వీటి పైన కోర్టులో విచారణ నడుస్తున్నాయని తెలిపారు. గురువారం కూడా కోర్టులో ఇయరింగ్ ఉందని పేర్కొన్నారు.
వీటన్నింటికీ పట్టించుకోకుండా పంచాయతీరాజ్ అధికారులు మా సొంత నిర్మాణాలను కూల్చివేయడం దుర్మార్గమని ఆరోపించారు. మా సొంత స్థలం పక్కనే ఉన్న రవీందర్ రెడ్డి అధికారులకు మ్యానేజ్ చేసి మాపై ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై కోర్టులోనే తేల్చుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డ సుదర్శిని, అనంతయ్య, రత్నమ్మ, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…