Hyderabad

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం – బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత

పటాన్ చెరు:

సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సమావేశానికి బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుధవారం పటాన్ చెరు మండలం ముత్తంగి బీజేపీ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మధురి ఆనంద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ సమావేశానికి వచ్చిన మహిళలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు.

 

జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ బలపడానికి మన మహిళా కార్యకర్తలు గడప గడపకు తిరుగుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్ద వివరిస్తూ పార్టీని చాలా బలోపేతంగా పటిష్ఠంగా చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని తెలిపారు. రాబోయే రోజులలో 2023 లో తెలంగాణలో ఉన్న నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిపించుకొని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి బీజేపీ అధ్యక్షుడు ఎలవర్తి ఈశ్వరయ్య, నాయకులు కోళ్లసుజాత, గడ్డ పుణ్యవతి, అనిత, అనూష, అనిత, ఝాన్సీరాణి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago