Telangana

గీతంలో వినూత్న మార్గదర్శన కార్యక్రమం

విద్యార్థుల సాధికారతే లక్ష్యంగా ప్రారంభించిన టీఎంసీజీ డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

అర్థవంతమైన మార్గదర్శనం, సలహాల ద్వారా విద్యార్థులకు సాధికారత కల్పించే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఒక వినూత్న విద్యార్థి మార్గదర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గీతం వృత్తిపరమైన సలహాల కేంద్రంలోని శిక్షణ, మార్గదర్శకత్వం, వృత్తిపరమైన సలహాలు (టీఎంసీజీ) డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ దీనికోసం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు తమ విద్య, వృత్తి, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ఆందోళనలను పరిష్కరించుకోవడంలో సహాయ పడటానికి ‘టాక్ టైమ్’ పేరుతో ఒక ప్రత్యేకమైన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా, డాక్టర్ మాథ్యూ 2026 మే 11 నుంచి డిసెంబరు 31 మధ్య కాలంలో, ప్రతిరోజూ సాయంత్రం 4.00 నుంచి 5.30 గంటల వరకు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు 15 నిమిషాల చొప్పున వ్యక్తిగత సంభాషణకు (నేరుగా మాట్లాడటం) ఆమె అవకాశం కల్పిస్తున్నారు. శని, ఆదివారాలు మినహా, మిగిలిన అన్ని పనిదినాలలో ఈ సెషన్లు అందుబాటులో ఉంటున్నాయి.నైపుణ్యాభివృద్ధి-పరిశ్రమ సంసిద్ధత, వృత్తి మార్గదర్శనం-మార్గాలు, మార్గదర్శకత్వం-వృత్తిపరమైన అభివృద్ధి, అభిప్రాయాలు-ఆందోళనలకు సంబంధించిన విషయాలను చర్చించడానికి విద్యార్థులకు సౌకర్యవంతమైన, బహిరంగ వేదికను అందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం విద్యార్థులను తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మార్గనిర్దేశం కోరడానికి, సహాయక వాతావరణంలో నిర్మాణాత్మక సలహాలను పొందడాన్ని ప్రోత్సహిస్తోంది.ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని డాక్టర్ రోజీనా మాథ్యూ వివరిస్తూ, విద్యార్థులు తమ ఆలోచనలను బహిరంగంగా పంచుకోవడానికి, ముఖ్యమైన నిర్ణయాలపై స్పష్టత పొందడానికి, వ్యక్తపరచడానికి సంకోచించిన ఆలోచనలను చర్చించడానికి, వారి విద్యా, వృత్తిపరమైన ఎదుగుదలను ప్రభావితం చేసే సవాళ్లపై కొత్త దృక్కోణాలను పొందడానికి వీలుగా నిజమైన, అర్థవంతమైన సంభాషణలను సృష్టించడం ఈ టాక్ టైమ్ కార్యక్రమ ఉద్దేశ్యమని చెప్పారు. స్లాట్ల సంఖ్య పరిమితంగా ఉన్నందున, విద్యార్థులు తమ వంతుగా సమయాన్ని పొందేటప్పుడు స్పష్టమైన చర్చాంశాలతో సిద్ధంగా రావాలని, అవకాశాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని, సార్థకమైన సంభాషణను చేయాలని ఆమె స్పష్టీకరించారు.విద్యార్థులతో తాను పంచుకున్న క్యూఆర్ కోడ్ లేదా వెబ్ లింక్ ద్వారా అపాయింట్ మెంట్లను రిజర్వు చేసుకోవాలని డాక్టర్ రోజీనా సూచించారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

7 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago