పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని మైత్రీ స్టేడియంలో ఈ నెల 4 నుంచి ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ 2023 ను ప్రారంభించనున్నట్లు ఎండీఆర్ యంగ్ లీడర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం. పృథ్వీరాజ్ తెలిపారు.పటాన్చెరులోని ఎండీఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు పటాన్ చెరు ప్రాంతంలోని కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు మానసికోల్లాసం, స్నేహభావం పెంపొందేందుకు ప్రతి ఏటా ఈ టోర్నమెంట్ ను జరపనున్నట్లుతెలిపారు. ఈ టోర్నమెంట్ ను ఈ నెల 12 వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఇక్రిషాట్, బీహెచ్ఈఎల్, తోషిబా తదితర కంపెనీల ఉద్యోగులు పాల్గొననున్నట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడుతామని ఎండీఆర్ యంగ్ లీడర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం. పృథ్వీరాజ్ తెలిపారు.స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ అంజనేయ గౌడ్ పాల్గొంటారని అన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…