Telangana

కిలోమీటర్ కమిషన్ పెంచండి

– ఓలో, ఉబర్ సంస్థలకు, ప్రభుత్వానికి క్యాబ్ డ్రైవర్ల విజ్ఞప్తి

– కమిషన్ పెంచాలంటూ క్యాబ్ యజమానులు, డ్రైవర్ల ధర్నా

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఓలో, ఉబర్ క్యాబ్ సంస్థలు కారు క్యాబ్ లకు కిలోమీటర్ రేట్ పెంచాలని పటాన్ చెరు కేంద్రంగా పనిచేస్తున్న క్యాబ్ యజమానులు, డ్రైవర్లు వాటి సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. శుక్రవారం పటాన్ చెరు మండల పరిషత్ ఆవరణలో ఓలో, ఉబర్ క్యాబ్ సంస్థలు కిలోమీటర్ చొప్పున రేటు పెంచాలని డిమాండ్ చేస్తూ 30 మందికి పైగా క్యాబ్ యజమానులు, డ్రైవర్లు ధర్నా చేపట్టి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓలో, ఉబర్ క్యాబ్ సంస్థలు క్యాబ్ లతో రోజువారీగా కమిషన్ బేసిక్ తో నడుపుతున్నామని అన్నారు. ఈ రెండు సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల కిలోమీటర్ కు 13, 14 రూపాయలు చెల్లిస్తుందని, అదేవిధంగా సిటీ బయటకు వాహనాలు వెళితే కిలోమీటర్ కు 9 రూపాయలు చెల్లిస్తుందని చెప్పారు. అలాగే సిటీ చుట్టుపక్కల నుండి ఎయిర్పోర్ట్ కు క్యాబ్ వెళితే కేవలం 600 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని అన్నారు. రోజువారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో పోలిస్తే క్యాబ్ సంస్థలు కిలోమీటర్ కు మాకు చెల్లిస్తున్న కమిషన్ సరిపోవటం లేదని, నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాబ్ సంస్థలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబ్ లకు కిలోమీటర్ చొప్పున 30 రూపాయలకు పైగా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. క్యాబ్ ల కమిషన్ తక్కువ రావడంతో పెరిగిన నిత్యవసరాలతో ఎంతగానో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని క్యాబ్ సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాబ్ యజమానులు, డ్రైవర్లు గౌతం, ప్రసాద్, రాందాస్, నాయుడు, రాజు, కృష్ణ, సయ్యద్, బబ్లు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago