Telangana

కిలోమీటర్ కమిషన్ పెంచండి

– ఓలో, ఉబర్ సంస్థలకు, ప్రభుత్వానికి క్యాబ్ డ్రైవర్ల విజ్ఞప్తి

– కమిషన్ పెంచాలంటూ క్యాబ్ యజమానులు, డ్రైవర్ల ధర్నా

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఓలో, ఉబర్ క్యాబ్ సంస్థలు కారు క్యాబ్ లకు కిలోమీటర్ రేట్ పెంచాలని పటాన్ చెరు కేంద్రంగా పనిచేస్తున్న క్యాబ్ యజమానులు, డ్రైవర్లు వాటి సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. శుక్రవారం పటాన్ చెరు మండల పరిషత్ ఆవరణలో ఓలో, ఉబర్ క్యాబ్ సంస్థలు కిలోమీటర్ చొప్పున రేటు పెంచాలని డిమాండ్ చేస్తూ 30 మందికి పైగా క్యాబ్ యజమానులు, డ్రైవర్లు ధర్నా చేపట్టి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓలో, ఉబర్ క్యాబ్ సంస్థలు క్యాబ్ లతో రోజువారీగా కమిషన్ బేసిక్ తో నడుపుతున్నామని అన్నారు. ఈ రెండు సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల కిలోమీటర్ కు 13, 14 రూపాయలు చెల్లిస్తుందని, అదేవిధంగా సిటీ బయటకు వాహనాలు వెళితే కిలోమీటర్ కు 9 రూపాయలు చెల్లిస్తుందని చెప్పారు. అలాగే సిటీ చుట్టుపక్కల నుండి ఎయిర్పోర్ట్ కు క్యాబ్ వెళితే కేవలం 600 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని అన్నారు. రోజువారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో పోలిస్తే క్యాబ్ సంస్థలు కిలోమీటర్ కు మాకు చెల్లిస్తున్న కమిషన్ సరిపోవటం లేదని, నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాబ్ సంస్థలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి క్యాబ్ లకు కిలోమీటర్ చొప్పున 30 రూపాయలకు పైగా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. క్యాబ్ ల కమిషన్ తక్కువ రావడంతో పెరిగిన నిత్యవసరాలతో ఎంతగానో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని క్యాబ్ సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాబ్ యజమానులు, డ్రైవర్లు గౌతం, ప్రసాద్, రాందాస్, నాయుడు, రాజు, కృష్ణ, సయ్యద్, బబ్లు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago