Telangana

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

గీతం అంతర్జాతీయ సదస్సులో స్పష్టీకరించిన వక్తలు * ఘనంగా ప్రారంభోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంటుందని, అందరూ తమవంతు సామాజిక బాధ్యతగా పర్యావరణ హిత చర్యలు చేపట్టాలని వక్తలు సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని అకౌంటింగ్ విభాగం ఆధ్వర్యంలో “పర్యావరణ, సామాజిక, పాలనలో సమకాలీన సమస్యలు’ (ఈఎస్ జీ ) అనే అంశంపై శుక్రవారం రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును జ్యోతి ప్రజ్వలతో ఘనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఐఎస్ డీసీ ), నాబార్డుల సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా నాబార్డు జనరల్ మేనేజర్ పీ.టీ.ఉష, అరబింబో ఫార్మా సలహాదారు డాక్టర్ జేవీఎన్ రెడ్డిలు పాల్గొనగా, ఐఎస్ డీసీ కార్యనిర్వాహక డైరక్టర్ తెరసా జాకబ్స్ కీలకోపన్యాసం చేశారు.

ఈఎస్ జీ సమకాలీన స్వభావాన్ని, స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లను ఉష, ప్రస్తావించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్వయం సమృద్ధి కోసం నాబార్డు చేసడుతున్న పలు పథకాలను ఆమె ఏకరువు పెట్టారు. ఈఎస్ జీ తన ఆలోచనలను జేడీఎన్ రెడ్డి సదస్యులతో పంచుకోవడంతో పాటు అన్ని పరిశ్రమలలో సుస్థిరత యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అరబిందో ఫార్మా పరిశ్రములో చేపడుతున్న పర్యావరణ హిత కార్యక్రమాలు, సౌర విద్యుత్ వినియోగం వంటి పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ ప్రాకృతిక వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని, ఈ భూమిని కాపాడుకోవడానికి అంతా తమవంతు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈఎస్ జీలో వ్యక్తిగత బాధ్యత, పాలనా సూత్రాల శక్తిని తనదిన శైలిలో తెరెసా జాకబ్స్ వివరించారు. ప్రతి పౌరుడూ తన సామాజిక బాధ్యతలో భాగంగా పర్యావరణ హిత కార్యకలాపాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.కార్పొరేట్ వ్యూహాలు, పెట్టుబడి నిర్ణయాలు, సామాజిక పురోగతిలో ఈఎస్ జీకి పెరుగుతున్న ప్రాముఖ్యతలను గీతం బీ-స్కూల్ ఇన్చార్జి డైరక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా నొక్కి చెప్పారు. ఈ రంగంలోని సవాళ్లు, అవకాశాలపై అర్థవంతమైన చర్చ, విభిన్న దృక్కోణాలను ఆవిష్కరించడం కోసం ఈ వేదికను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు.ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వాహకుడు డాక్టర్ జీఆర్ కె ప్రసాద్ వందన సమర్పణతో ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసింది. శనివారం వరకు కొనసాగనున్న ఈ సదస్సులో భాగంగా, ఈఎస్ జీపై చర్చాగోష్టులు, నిపుణులతో ప్రసంగాలను కూడా నిర్వహిస్తున్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago