Telangana

తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక 20 24 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక 20 24 సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు భేరీ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్, గుల్ మోహర్ కాలనీ అధ్యక్షులు ఖాసీం సార్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తెల్ల హరికృష్ణ పాల్గొని తన సందేశంలో తెలంగాణ మొత్తం రాష్ట్రంలో బీసీ ఐక్యవేదిక జేఏసీ విస్తరించి ఐకమత్యం ద్వారా ఒకే గొడుగు కిందికి తీసుకొని రావాలని కోరారు. జాతీయ అధ్యక్షులు కస్తూరి గోపాల కృష్ణ జిల్లాల వ్యాప్తంగా కమిటీలు వేసి మనం బీసీల కొరకు పని చేద్దామని తెలిపారు బీసీ వికాస సమితి అధ్యక్షులు నర్సింగరావు మాట్లాడుతు ఐకమత్యమే మహాబలం రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం బీసీ లందరూ తప్పక పోటీ చేసి రాజ్యాధికారం వైపు దూసుకుపోవాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. జనగణన, కుల గణన చేయాలనీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.రాబోయే ఎంపీ ఎలక్షన్లో అన్ని పార్టీలు బీసీలకు 30 నుండి 50 శాతం వరకు సీట్లు కేటాయించాలని కోరారు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీసీ రథయాత్ర చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా బీసీలను కలిసి అన్ని కుల సంఘాలను కలుపుకొని జేఏసీ ద్వారా రాజ్యాధికారం వైపు తీసుకెళ్లటానికి ప్రయత్నం చేస్తామని. అగ్రవర్ణాలు మనకు అధికారం అప్పగించరు మనమే ఏకమై మన ఓటు మనకు నినాదంతో రాజ్యాధికారం సాధిద్దామని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ తో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు కలుపుకొని రాజ్యాధికారం వైపు దూసుకెళ్తామని భేరీ రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో వికాస్ నర్సింగరావు, మధుకరాచారి, ఆర్కే సాయన్న, ఎస్సీ జేఏసీ అధ్యక్షులు నరసింహ, వెంకటేశ్వరరావు సార్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, కుమార్ యాదవ్, మధు యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago